-అనుచరులతో చర్చించి రెండురోజుల్లో నిర్ణయం -అవసరమైతే ఇండిపెండెంట్గా దిగుతా -టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ మచిలీపట్నం, మహానాడు: తాను పెడన నియోజకవర్గం సీటు ఆశించానని, చంద్రబాబు సీటు ఇవ్వకపోవటంతో మనస్థాపంతో అస్వస్థతకు గురయ్యానని మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు బూరగడ్డ వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయు డు, లోకేష్ లు 2019లోనే […]
Read Moreలంచం కేసులో విద్యుత్ ఏడీఈకి నాలుగేళ్ల జైలుశిక్ష
కరీంనగర్: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు చిక్కిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్కు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ అనిశా ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మకు చెందిన గాండ్ల కన్నమయ్య ప్రభుత్వం తత్కాల్ స్కీం ద్వారా వ్యవసాయ భూములకు విద్యుత్ సరఫరా చేస్తుందని తెలిసి మరికొంత మంది రైతులతో […]
Read Moreజగన్ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగాయి
-ముస్లింల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం -రాజకీయ లబ్ధి కోసం వైసీపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోంది -ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకం కింద రూ.లక్ష ఆర్దిక సాయం -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -నిడదవోలులో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు నిడదవోలు :ముస్లిం మైనార్టీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తూ.గో జిల్లా నిడదవోలులో గురువారం రంజాన్ వేడుకల్లో […]
Read Moreలోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన జగన్ సన్నిహితుడు!
ఉండవల్లి: మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దాలన్న యువనేత నారా లోకేష్ సంకల్పానికి నియోజకవర్గ ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. లోకేష్ నినాదానికి ఆకర్షితులైన వివిధ పార్టీల నేతలు యువనేత సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు, మంగళగిరి రూరల్ మండలం కురగల్లు గ్రామానికి చెందిన ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు కట్టెపోగు బసవరావు ఆధ్వర్యంలో 10మంది టిడిపిలో చేరారు. జగన్ కు సంఘీభావంగా ఇడుపులపాయ నుంచి […]
Read Moreకాంగ్రెస్ నాయకులు అన్ని వర్గాల ప్రజలను బెదిరిస్తున్నారు
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక దేశవ్యాప్తంగా మతకల్లోహాలు, కర్ఫ్యూలే ఉంటాయని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వర్గాల ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు… ఇలా అందరినీ బెదిరించి ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. గురువారం ఆయన సికింద్రాబాద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ నుంచి ఢిల్లీకి వందల కోట్ల […]
Read Moreకవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ నేడు అరెస్ట్ చేసింది. ఆమె ప్రస్తుతం ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఆమెను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఇప్పుడు సీబీఐ ఆమెను తీహార్ జైల్లోనే ప్రశ్నించనుంది. సీబీఐ గత ఏడాది హైదరాబాద్లోని ఆమె నివాసంలో విచారించింది. ఆమెను మరోసారి విచారించేందుకు రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ అనుమతి తీసుకుంది. […]
Read Moreస్టే ఆర్డర్ కాపీ తెచ్చేలోపే ఇల్లు కూల్చేశారు!
-యువనేత ఎదుట చేనేత ప్రముఖుడి ఆవేదన -తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ భేటీ మంగళగిరి: రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరికి చెందిన తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ గురువారం భేటీ అయ్యారు. మంగళగిరి 4వవార్డులో నివసిస్తున్న జంజనం మల్లేశ్వరరావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారి కుటుంబసభ్యులు యువనేతకు సాదర స్వాగతం పలికారు. […]
Read Moreమోహన్ రావుపై వైసీపీ గూండాల దాడిని ఖండించిన చంద్రబాబు
–ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి :- ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రౌడీయిజం చేయకపోతే పూటగడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించిందని, […]
Read Moreసొంత చెల్లెళ్ళు కూడా నమ్మని వ్యక్తి మనకెలా రక్షణ ఇస్తాడు..?
ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఎలా పని చేస్తారో చూస్తారు 30 వేల మంది ఆడపడుచులు అదృశ్యం అయితే దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు అన్ని వర్గాలకు అండదండగా కూటమి ప్రభుత్వం పాలనలో జవాబుదారీతనం తీసుకొస్తాం ప్రతి చేతికీ పని.. ప్రతి చేనుకీ నీరు అన్నదే నినాదం నిడదవోలు వారాహి విజయభేరీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ‘ప్రజాగళానికి వేదిక అయిన అసెంబ్లీలో ప్రజల కోసం పని […]
Read Moreరాష్ట్రంలో చల్లబడ్డ వాతావరణం
ఐదురోజులు వర్షాలే.. హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఐదురోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మధ్య మహారాష్ట్ర దగ్గర ఆవర్తనం కేంద్రీకృతమైందని, దీని వల్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. […]
Read More