గుడివాడ: నియోజవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ఓటమిని తట్టుకో లేక సైదేపూడి గ్రామానికి చెందిన పిట్ట అనిల్ అనే వాలంటీర్ ఆత్మహత్య చేసు కున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకుని అనిల్ కుటుంబ సభ్యులను కొడాలి నాని పరామర్శించారు. అంతేకాకుండా రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును కుటుంబసభ్యులకు అందజేశారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి అండ గా ఉంటానని భరోసా ఇచ్చారు.
Read Moreహరిత తారామతి బారదారి రిసార్ట్స్ అధ్వానం
నిర్వహణ లోపాలపై పర్యాటక మంత్రి జూపల్లి ఆగ్రహం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశం భవిష్యత్లో గోల్కొండ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు వెల్లడి హైదరాబాద్: హరిత తారామతి బారదారి రిసార్ట్స్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిసార్ట్స్ అంతా కలియదిరిగారు. హరిత హోటల్ రూమ్స్, హరిత రెస్టారెంట్, పుష్పాంజలి ఆంఫి థియేటర్, ఆడిటోరియం, స్విమ్మింగ్ ఫూల్, టాయిలెట్స్ను పరిశీలిం చారు. రిసార్ట్స్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం […]
Read Moreఎంపీల్లో 93 శాతం మంది కోటీశ్వరులే
తొలి రెండు స్థానాల్లో తెలుగు వాళ్లే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ వెల్లడి ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో 93 శాతం మంది కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్’ (ఏడీఆర్) తెలిపింది. గత ఎంపీల్లో 475 మంది మిలియనీర్లు ఉండగా ఈసారి 504కు పెరిగిందని వెల్లడిరచింది. ధనిక ఎంపీల్లో గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,705 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి […]
Read Moreఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్
కొత్త ప్రభుత్వం ఏర్పాటు ముందు కీలక మార్పులు బదిలీపై వెళ్లిన జవహర్రెడ్డి..ఆ వెంటనే ఉత్తర్వులు సీఎంవో టీమ్పైనా కొనసాగుతున్న కసరత్తు అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్ నియమితుడయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్కు చెందిన ఆయన గతంలో చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శిగా పనిచేస్తున్నారు. […]
Read Moreచంద్రబాబు ప్రమాణానికి వెళ్లనున్న రేవంత్!
ఆంధ్రప్రదేశ్ లో అపూర్వ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా చంద్రబాబుకు రేవంత్ గురువారం ఫోన్ చేసి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకు సేందుకు సహకరించాలని కోరారు. కాగా ఈనెల […]
Read Moreభారతీరెడ్డి చేతికి పార్టీ పగ్గాలు?
– లోక్సభకు జగన్? – అసెంబ్లీకి జగన్ డుమ్మా? – అవినాష్తో రాజీనామా ? – పులివెందుల బరిలో భారతీరెడ్డి? – వైసీపీలో కొత్త చర్చ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకున్న వైసీపీకి కొత్త అధ్యక్షురాలు రానున్నారా? పార్టీ అధినేత జగన్ లోక్సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? ఆయన భార్య భారతరెడ్డికి పార్టీ పగ్గాలందించే యోచన చేస్తున్నారా?.. ఇదీ ఇప్పడు వైసీపీ వర్గాల్లో జరుగుతున్న […]
Read Moreనందిగం సురేష్ పీఏ అరెస్టు
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిని లారీతో తొక్కించేస్తానని బెదిరించిన తాజా మాజీ ఎంపీ నందిగం సురేష్ పీఏ మేకల లక్ష్మణ్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
Read Moreభళా సుజనా!అసాధారణం విజయంతో అన్నీ రికార్డులే…
యలమంచిలి సత్యనారాయణ చౌదరి…అంటే ఎవరో చాలమంది గుర్తు పట్టకపోవచ్చు.. అదే సుజనా చౌదరి అనండి…తెలీని తెలుగువాడుంటాడేమో…కారణమేంటంటే…వ్యక్తిగా తాను ఎంత సైలెంట్ అయినా డీసెంట్ అయినా ఆయన ట్రాక్ రికార్డ్ మాత్రం అంత ఎలాబరేటింగ్ గా ఉంటుంది. అత్యంత సుసంపన్న వ్యాపారి దశ నుంచి… చంద్రబాబు సన్నిహితుడిగా మారి…అలా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి….తొలుత సొంత పార్టీలోనే అసంతృప్తులు ఎదుర్కొని…ఆనక అందరికీ ఆప్తుడుగా మారి…ఏకంగా కేంద్ర మంత్రిగా ఢిల్లీలో పాగా వేసి…అనంతరం మారిన […]
Read Moreమైనార్టీలు ముగ్గురు టీడీపీనే…మిగతా పార్టీలకు నో ఛాన్స్..
2024 ఎన్నికల ఫలితాలు అనేక సంచలనాలకు వేదికగా మారాయి. అందులో మైనార్టీ ఎమ్మెల్యేల అంశం కూడా ఒకటి. ఈసారి ఏపీ అసెంబ్లీ లో ముగ్గురు మైనార్టీ ఎమ్మెల్యేలు కనిపించనున్నారు. అయితే వాళ్ళు ముగ్గురు టీడీపి నుంచి గెలిచినవారు కావడమే విశేషం. ఇటు కూటమి లోని జనసేన,బిజెపి నుంచి మైనార్టీలకు సీట్ లభించకపోవడం, అటు వైసీపీ నుంచి సీట్ దక్కించుకున్నవారెవరూ గెలవకపోవడం తో ఇక టీడీపి నుంచి గెలిచిన ఈ ముగ్గురే […]
Read Moreముచ్చటగా మూడోసారి మోడీ!
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాల్లో బిజీగా ఉంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీఏ పక్షాల నేత సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు. ఎన్డీఏ లోక్ సభ పక్ష నేతగా మోదీని సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి […]
Read More