తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 4 నెలల్లో 10 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు నిన్న ఆమెను ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె భర్త సమక్షంలో వైద్య పరీక్షలు పూర్తి కాగా, ఆమె 10 కేజీల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. టెస్టుల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించారు. కవితను పరామర్శించేందుకు కేటీఆర్, హరీశ్ రావు […]
Read Moreతెలంగాణ సరిహద్దులో మళ్లీ ఎదురు కాల్పులు
చత్తిస్ ఘడ్: తెలంగాణ, చత్తిస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టు, పోలీసులకు మధ్య ఈ రోజు ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా తెలిసింది. దీంతో, సరిహద్దు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎదురు కాల్పులకు సంబంధించిన వివరాలు ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ వెల్లడించారు. చత్తిస్ ఘఢ్ తెలంగాణ లోని సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం ఉదయం 07.00 […]
Read Moreపర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టండి
-ఐటీ ఉద్యోగులు, జాతీయ ,అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయం పెంచుకునేందుకు ప్రణాళికలు చేయండి -పర్యాటక శాఖ సొంత ఆస్తులు, లీజులో ఉన్న ఆస్తుల వివరాల పై సమగ్ర నివేదిక సమర్పించండి -90 శాతం నిర్మాణాలు పూర్తి చేసి.. వృధాగా ఉన్న పర్యాటక ఆస్తులను గుర్తించి వినియోగంలోకి తీసుకురండి -క్రీడా మైదానాలు ఖాళీగా పెట్టొద్దు.. రెసిడెన్షియల్ విద్యార్థులతో నిత్యం క్రీడలు నిర్వహించాలి -పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ncc బడ్జెట్ సమీక్ష సమావేశంలో […]
Read Moreక్షత్రియాత్మీయ సన్మాన స్వీకరణకు సిఎం రేవంత్ సుముఖత
– ఆగస్టు 18, క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన సభ!” తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆగస్టు 18న క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. గత రెండేళ్లుగా క్షత్రియ వైభవానికీ, వారి ఐక్యతకూ కృషి చేస్తూ, అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ, సామాజిక పరంగా అప్పగించిన బాధ్యతలను తు.చ. తప్పకుండా నిర్వర్తిస్తున్న క్షత్రియసేవా సమితి (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) మరో […]
Read Moreఫేక్ పాలిటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ జగన్
-జగన్ అంటేనే ఫేక్కు బ్రాండ్ అంబాసిడర్ -వైఎస్సార్సీపీ పుట్టుక నుంచి ప్రస్థానం వరకు అక్కడ నుంచి నేటి పతనం వరకు ఆయన నమ్ముకుంది ఫేక్ పాలిటిక్స్నే -జగన్ మాట, నడక, నవ్వు, నమస్కారం కూడా ఫేక్ -తనకు మాత్రమే ఉన్న ఫేక్ పాలిటిక్స్ పేటెంట్తో మరోసారి తన పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం -ధ్వజమెత్తిన టీడీపీ శ్రేణులు అమరావతి,మహానాడు: పల్నాడు జిల్లా వినుకొండలో హత్యకు గురైన షేక్ రషీద్(25) కుటుంబాన్ని […]
Read Moreతవ్వే కొద్దీ బయటపడుతున్న ఇసుక అక్రమాల గుట్ట
-అక్రమ తవ్వకాలపై వాస్తవాలను కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మహానాడు: గత ఐదేళ్లలో జగన్ సర్కార్లో సాగిన అక్రమ ఇసుక దందా బయట పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. గతంలో అక్రమ తవ్వకాలు లేవని పలు జిల్లాల కలెక్టర్లు నివేదికలిచ్చి తప్పులు కప్పిపుచ్చే ప్రయత్నం చేయగా, తాజాగా వాస్తవాలతో నివేదికలు ఇస్తామని సుప్రీంకోర్టుకి తెలిపిన ప్రభుత్వం, ఆ దిశగా చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా వివిధ శాఖల అధికారులతో కూడిన జాయింట్ కమిటీలతో […]
Read Moreఉన్నతాధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి
-నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్,మహానాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట ట్యాంక్కు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచన మరియు దురదృష్టకర సంఘటనల దృష్ట్యా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోని సి ఈ లు, మరియు ఉన్నతాధికారులు వారి వారి ప్రధాన కార్యాలయంలో నిరంతరం అందుబాటులో ఉండాలని మరియు కార్యదర్శి యొక్క ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ […]
Read Moreకర్నూలులో సినీనటి శ్రీరెడ్డిపై కేసు నమోదు
కర్నూలు,మహానాడు :సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ను ఇష్టానుసారంగా దూషించినందుకు సినీనటి శ్రీరెడ్డిపై కర్నూలులో కేసు నమోదు అయింది. వారితో పాటు మంత్రులు లోకేశ్, అనితపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది.సామాజిక మాధ్యమాల్లో వారిపై అసభ్య కామెంట్స్ చేసినందుకు టీడీపీ నేత రాజుయాదవ్ శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీరెడ్డిపై చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా శ్రీరెడ్డి వల్ల వైసీపీ పార్టీకి చెడ్డ పేరు […]
Read Moreపోలీసులు గతంలో చేసిన పనులనే మళ్లీ చేస్తున్నారు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అమరావతి,మహానాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్దితిపై ఆందోళన చెందాల్సిన పరిస్దితి నెల్కొంది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఉన్న ఇంటి దగ్గరకు వెళ్లి దాడికి వెళ్ళటం సరైన పద్దతి కాదని అన్నారు. గతంలో వైసీపీ ఇదే తరహా దాడులకు పాల్పడింది. […]
Read Moreగోరంత చేసి కొండంత చెప్పుకుంటున్నారు
– బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హైదరాబాద్ , మహానాడు: గోబెల్స్ బతికి ఉంటే వీళ్ల ప్రచారం చూసి చచ్చిపోయేవాడు. గత ప్రభుత్వం మీద రాళ్ళు వేస్తూ గోరంత రుణమాఫీ చేసి కొండంత చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను దుయ్యబట్టారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రుణ మాఫీకి ఎలాంటి నిబంధనలు గత మా ప్రభుత్వం పెట్టలేదు. 2014 లో 16 వేల […]
Read More