సినీ ఇండస్ట్రీలో ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పేరిట మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకావడం లేదని ఫ్యామిలీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు, సీఎంకు టీటీడీ జేఈఓ గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.
Read Moreరేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబుకి ఘన స్వాగతం
రేణిగుంట, జూన్12: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం అనంతరం మొట్ట మొదటి సారిగా తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి బుధవారం రాత్రి 7.35 గం.లకు కుటుంబ సమేతంగా చేరుకున్న ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి గారి వెంట మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కరికాల వలనన్, డిఐజీ షిమోషి, తిరుపతి, […]
Read Moreమ్యూజియాలకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రాంతంలోని రైల్వే మ్యూజియం సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియాలకు కొందరు వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఆయా మ్యూజియాల దగ్గర, సమీప ప్రాంతాల్లో పెద్దఎత్తున తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది బూటకపు మెయిల్ […]
Read Moreచంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
అమరావతి: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణస్వీకారం చరిత్ర లో చిరస్థాయిలో నిలిచిపోతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి కొనియాడారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాల యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్బంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
Read Moreవిశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రంతో మాట్లాడుతా
-ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశం -కేంద్ర సహాయమంత్రి శ్రీనివాసవర్మ వ్యాఖ్యలు అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజలకు సెంటిమెంట్ తో కూడుకున్నదని, ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు. ప్రజలకు మేలు జరిగేలా అడుగులు వేస్తామని వివరించారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశంగా పేర్కొన్న ఆయన ఏపీకి కేంద్రం స్పెషల్ […]
Read Moreవికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేయాలి
-బీజేపీ బలోపేతానికి కృషిచేయాలి -ప్రజల్లోకి వెళ్లి కేంద్ర పథకాలు వివరించాలి -పదాధికారుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. మంత్రి సత్యకుమార్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం చేసే మేళ్లు ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. గెలిచిన శాసనసభ్యులు కూడా జిల్లాల్లోకి వెళ్లి పర్యటనలు చేయాలని, కార్యకర్తల కష్టాలు పట్టించుకోవాలని […]
Read Moreటీటీడీ పీఆర్వోగా నీలిమ బాధ్యతలు
తిరుమల : టీటీడీ పీఆర్వోగా నీలిమ టీటీడీ పరిపాలనా భవనంలోని కార్యాల యంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన టి.రవికి నాలుగు నెలల క్రితం సీపీఆర్గా ఉద్యోగోన్నతి లభించడంతో ఆ స్థానంలో నీలిమ బాధ్య తలు చేపట్టారు. నూతన పీఆర్వోకు పలువురు జర్నలిస్టులు, ఉద్యోగులు కార్యా లయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Read Moreదుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని కేంద్ర సహాయమంత్రి తెలంగాణకు చెందిన బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఈవో స్వాగతం పలికారు. ఏపీకి చెందిన మంత్రి కందుల దుర్గేష్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో స్వాగతం పలికారు. వేదపండితులు, అర్చ కులు ఆశీర్వచనం చేశారు. ఈవో అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్రపటం అందజేశారు.
Read Moreకనకదుర్గమ్మను దర్శించుకున్న పన్నీర్ సెల్వం
విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో కార్యనిర్వాహణాధికారి కె.ఎస్.రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్యతను వివరించారు.
Read More