టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఐడీకి జనసేన ఫిర్యాదు

కేసు నమోదు చేసి పాస్‌పోర్ట్‌ సీజ్‌ చేయాలి లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేయాలని వినతి తిరుపతి: నగరంలోని సీఐడీ కార్యాలయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. అర్హత లేకపోయినా జగన్‌ ఆశీస్సులతో ఐదేళ్ల పాటు ఈవోగా వందల కోట్లు దోచేశారని, కూటమి రావడంతో ధర్మారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. టీటీడీలో ఆభరణాలు, నిధులు, శ్రీవారి డబ్బులు వెనకేసుకున్నారని పేర్కొన్నారు. ప్రభు త్వం […]

Read More

వంద మంది రేవంత్‌లు వచ్చినా బీఆర్‌ఎస్‌ను పీకలేరు

బీజేపీకి అవయవదానం చేసింది కాంగ్రెస్‌ పార్టీనే ఆ పార్టీ గెలుపు కోసమే ఓట్లు బదిలీ చేశారు బీఆర్‌ఎస్‌ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, దేవిప్రసాద్‌ హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ నేతలు జి.దేవిప్రసాద్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, బీఆర్‌ఎస్‌పై ప్రేలాపనలు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వాస్తవానికి ఓట్లు […]

Read More

హైదరాబాద్‌, ఒంగోలులో ఈడీ దాడులు

హైదరాబాద్‌:  బ్యాంకు నుంచి పెద్దఎత్తున డబ్బును దారి మళ్లించిన వ్యవహా రంలో హైదరాబాద్‌, ఒంగోలులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చదల వాడ ఇన్‌ఫ్రా టెక్‌ లిమిటెడ్‌ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంకు నుంచి రూ.166.93 కోట్ల నగదును ఆ కంపెనీ దారి మళ్లించి నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో సోదాలు చేస్తున్నారు.

Read More

లొంగిపోయేందుకు సిద్ధమైన కేతిరెడ్డి, అనుచరులు

అనంతపురం: తాడిపత్రి అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎస్పీకి సమాచారం ఇచ్చిన ఆయన తన 38 మంది అనుచరులతో లొంగిపోనున్నట్లు తెలిసింది. పోలింగ్‌ రోజు, తర్వాత జరిగిన అల్లర్లలో నిందితులుగా పెద్దారెడ్డి, ఆయన అను చరులపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

Read More

నగరిలో రోజా ఓటమిపై వైసీపీ సంబరాలు

తిరుపతి : నగరిలో రోజాపై వైసీపీ అసమ్మతి వర్గం ఆగ్రహం తారాస్థాయికి చేరింది. ఓడిపోయినా వారి ఆగ్రహం చల్లారడం లేదు. గురువారం వైసీపీ అసమ్మతి నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రోజాపై నగరి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ శాంతి తీవ్ర విమర్శలు చేశారు. రోజా ఓటమితో నగరి కి పట్టిన పదేళ్ల పీడ విరగడైంది. నగరి ప్రజలతో కలిసి ఆనందాన్ని పంచుకుం టున్నామని తెలిపారు. రోజా అడుగుపెట్టినప్పటి నుంచి […]

Read More

చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి అభినందనలు

హైదరాబాద్‌:  ఏపీలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండిరగ్‌లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణం లో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు. గురువారం మధ్యాహ్నం మహబూబాబాద్‌ నియోజకవర్గ ఫలితాలపై సమీక్ష జరిగింది. మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, విప్‌ రాంచంద్ర నాయక్‌, […]

Read More

మోదీ ప్రమాణ స్వీకారానికి పొరుగు దేశాల అధినేతలు

ఢిల్లీ:  తమ కూటమికి నాయకుడిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నరేంద్రమోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయన మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయ మైంది. ఈ నెల జూన్‌ 8న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమా ణస్వీకార మహోత్సవానికి పొరుగుదేశాలైన బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషస్‌ అధినేతలకు మన ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి.

Read More

తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ

రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిరది అందుకే మాకు ఆదరణ…ఓటింగ్‌ పెరిగింది వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం హామీలు అమలుచేయని కాంగ్రెస్‌ మోసాలను ఎండగడతాం మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీ:  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ గతంలో కంటే గణనీయమైన సీట్లు, ఓట్ల శాతం సంపాదించాం. సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో గత పదేళ్ల తెలంగాణలోనూ స్వతంత్రంగా పోటీచేసి ఇన్ని సీట్లు ఏనాడూ పొందలేదని తెలిపారు. […]

Read More

చంద్రబాబును కలిసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని నివాసంలో గురువారం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎంపీ, ఎమ్మెల్యేలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. ఫలితాలు వెలువ డిన అనంతరం రెండో రోజూ కూడా నేతలు, కార్యకర్తల రాకతో చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర సందడి వాతావరణం నెలకొంది.

Read More

అట్లాంటాలో తెలుగు, వీర మహిళల సంబరాలు

నారీ శక్తి పేరుతో విజయోత్సవం కూటమి గెలుపును స్వాగతిస్తూ కార్యక్రమం అమరావతి: దిక్కులు పిక్కటిల్లే విజయాన్ని అందించిన ఆంధ్రా ప్రజల తీర్పు స్వాగతిస్తూ అట్లాంటా తెలుగుదేశం ఆడపడుచులు, వీర మహిళలు సంబరాలు అంబరాన్ని అంటేలా చేసుకున్నారు. ఏపీలో ఏ విషయాన్ని అయినా గమినిస్తూ ఏ అవసరం వచ్చినా తమ వంతు సహాయం చేయటానికి ముందుండే ప్రవాసాం ధ్రులలో ముఖ్యులు అట్లాంటా తెలుగు ప్రజలు. ఈ ఎన్నికలలో కూడా ముఖ్య భూమిక […]

Read More