తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడితే ఊరుకోం

-ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదు -తెలంగాణ స్పీకర్ కనబడటం లేదు -ఓటమి భయంతోనే కాంగ్రెస్ సర్కార్ పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం లేదు -ఏడు నెలల నుంచి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు -గ్రామ పంచాయతీకి నిధులు లేవు -అవుట్ సోర్సింగ్ గ్రామ కార్యదర్శులకయితే ఆరు నెలల నుంచి వేతనాలు లేవు – బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి […]

Read More

తెలంగాణ జర్నలిస్ట్‌ వాకిటి కు అమెరికా ఆహ్వానం

– క్లైమెట్‌ క్రైసెస్‌ ఫర్‌ వెదర్ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ ప్రాజెక్టులో పార్టిసిస్పెంట్‌గా ఆహ్వానం హైదరాబాద్‌: అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు క్లైమెట్‌ క్రైసెస్‌ ఫర్‌ వెదర్ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ ప్రాజెక్టులో పార్టిసిస్పెంట్‌గా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక సీనియర్‌ జర్నలిస్ట్‌ వాకిటి వెంకటేశం ముదిరాజ్‌. ఈ ప్రాజెక్టు ఈ నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అమెరికా లోని వాషింగ్టన్ డీసీ, ఓక్లహామ్‌,కొలరాడో, ఫ్లోరిడా ప్రాంతాల్లో పర్యటించి, వాతావరణంపై […]

Read More

గురుకుల హాస్టల్ లో బీర్లు తాగుతున్న గురువిణి

-హాస్టల్‌ కేర్ టేకర్‌తో కలిసి అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ శైలజ -రోడ్డెక్కిన బాలికలు -సోషల్‌మీడియాలో వీడియో వైరల్ అది గురుకుల బాలికల హాస్టల్. కాబట్టి హాస్టల్ ప్రిన్సిపాల్, కేర్‌టేకర్ ఒళ్లంతా కళ్లు చేసుకుని బాలికలను కాపలాకాయాలి. హాస్టల్‌కు ఎక్కడా చెడ్డపేరు రాకుండా చూడాల్సిన బాధ్యత వారిది. అంటే.. అక్కడి చేనుకు వారిద్దరూ కంచె లాంటివాళ్లన్నమాట. మరి ఆ కంచె.. చేనును మింగేస్తే?..సూర్యాపేట బాలికల హాస్టల్‌లో ఇప్పుడు సరిగ్గా […]

Read More

అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్

జమ్ము కాశ్మీర్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపి వేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు. శనివారం భారీ వర్షాలు పడే అవకాశం […]

Read More

నిమ్స్ హాస్పటల్ ప్రొఫెసర్ ఆత్మహత్య

హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకర్,ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట లోని తన నివాసంలో అధిక మోతాదులో మత్తుమందు తీసుకుని ఆమె ఆత్మహత్య కు పాల్పడ్డారు. ప్రాచీకర్ నిమ్స్ ఆస్పత్రిలో అనస్తీషియా డిపార్ట్‌మెంట్‌ లో అడిషినల్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

Read More

సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్

– ప్రధాని, రైల్వే శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – గతంలో ఈ రైలు అవసరంపై రైల్వే మంత్రికి లేఖ రాసిన కిషన్ రెడ్డి న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలనుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్ లతో సికింద్రాబాద్ నుండి బయలుదేరి […]

Read More

జనం ఎదుటే చేపల దోపిడీ

(బహదూర్) మర్రిపాడు : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని పడమటి నాయుడు పల్లి చెరువులో బహిరంగంగానే చేపల చోరీ వెలుగు చూసింది. ఆదివారం మార్కెట్ లో అమ్ముకునేందుకు … ఓ లారీలో చేరిన వ్యాపారులు చెరువులో చేపల వేటను నిర్వహించారు. పంచాయతీ అనుమతి లేకుండా శనివారం అక్రమంగా చేపల వేట సాగించారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు నిద్రావస్థలో జోగుతుండడంతో లక్షలాది రూపాయల పంచాయతీ ప్రజాధనానికి గండి […]

Read More

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేశవరావు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహా దారుగా కె. కేశవరావు ఈరోజు నియమితుల య్యారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల కేకే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అనంత‌రం ఆయ‌న తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో కెకె ను స‌ల‌హాదారుగా రేవంత్ ప్ర‌భుత్వం నియ‌మించింది.

Read More

మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే సౌమ్య

అమరావతి , మహానాడు : 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయదుంధుభి మోగించిన తరుణంలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ పట్టణం పల్లగిరిలో వేంచేసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో తంగిరాల సౌమ్య బృందం 202 కొబ్బరికాయలను కొట్టారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే తంరిగాల సౌమ్య అత్యధిక భారీ మెజారిటీ గెలిచిన సందర్భంగా మొక్కులు […]

Read More

ఇకపై నేరుగా విద్యార్థులకే కాస్మొటిక్స్

అమరావతి , మహానాడు : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను (పేస్ట్, బ్రష్, షాంపూ వగైరా) నేరుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అయ్యే మొత్తాన్ని గత ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో జమ చేసే విధానం తెచ్చినా సరిగా అమలు కాలేదు. దాదాపు రూ.10 కోట్ల బకాయిలున్నట్లు తేల్చింది. దీంతో ఇకపై వస్తువుల్ని విద్యార్థులకే  నేరుగా ఇవ్వాలని నిర్ణయించింది. 548 పాఠశాలల్లో 1.25 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

Read More