బడ్జెట్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు!

తెలంగాణకు 50 వేల కోట్లు   అభయహస్తం భస్మాసుర హస్తమైంది!   బీజేపీ ఎంపీ రఘునందన్ రావు న్యూఢిల్లీ , మహానాడు:  కేంద్ర బడ్జెట్‌పై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాలకు సమపాళ్లలో కేటాయింపులు జరిగాయన్నారు. గత పదేళ్లుగా ఎన్డీఏ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటే! జెండాలు మాత్రమే మారాయి […]

Read More

రాష్ట్రానికి 15000 కోట్లు మంజూరు హర్షణీయం

రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కోర్ కమిటీ సభ్యులు  విజయవాడ , మహానాడు:  రాష్ట్ర అభివృద్ధికి, అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కోర్ కమిటీ సభ్యుడు ప్రకాష్ నందిరాజు అన్నారు. రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపు వల్ల విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా ఏర్పరిచి మోడీచే […]

Read More

భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాలకు మంత్రి కోమటిరెడ్డి

బోనాల ఉత్సవ ఏర్పాట్లపై మంత్రి ఆరా  హైదరాబాద్, మహానాడు:  రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయ ధర్మకర్తలు, దేవాదాయ శాఖ అధికారులు బోనాల ఉత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి బోనాల ఉత్సవ ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాలకు హైదరాబాద్ వ్యాప్తంగా భక్తులు వస్తారని, ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. ఈ నెల […]

Read More

సంపన్నులకు వరాలు.. పేదలకు సవతి ప్రేమ

-కేంద్ర బడ్జెట్లో దళిత ఆదివాసీలకు మొండిచేయి -దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  విజయవాడ , మహానాడు:  సబ్ కా సాత్ సబ్కా వికాస్ అనే ప్రధానమంత్రి నినాదానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తిలోదకాలు ఇచ్చి, దళిత ఆదివాసీలకు మొండి చెయ్యి చూపించారని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. చిట్టిబాబు అన్నారు. నేషనల్ క్యాంపెయిన్ దళిత హ్యూమన్ రైట్స్, దళిత బహుజన శ్రామిక […]

Read More

మద్యం కుంభకోణంలోని ప్రతి కోణాన్నీ బయటపెడతాం

అబ్కారీ శాఖలో జగన్ రెడ్డి అక్రమాల్నీ నిగ్గు తేలుస్తాం నిషేధం పేరుతో ఓట్లేయించుకుని పచ్చి మద్యంతో జేబులు నింపుకున్నారు జగన్ రెడ్డి నిర్ణయంతో తెలంగాణ మద్యం ఆదాయం పెరిగింది డిస్టిలరీలన్నీ గుప్పిట్లో పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు నగదు లావాదేవీల ద్వారా వేల కోట్ల ప్రజా ధనం జగన్ ఖజానాకు చేరింది జగన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం అమరావతి : […]

Read More

సీబీసీఐడీకి శ్రీహరి రావు హత్య కేసు

– ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్  అవనిగడ్డ, మహానాడు: నాలుగేళ్ల క్రితం అవనిగడ్డ నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు విచారణను ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఎంతో సంచలనాత్మకంగా మారిన ఈ కేసును పోలీసులు ఛేదించలేకపోయారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్ళగా, వెంటనే స్పందించి సీబీసీఐడీ విచారణకు […]

Read More

ఇదే బుడ్డోళ్ల బువ్వ..!

అంగన్ వాడీల్లో కలెక్టర్ అకస్మిక తనిఖీ శభాష్.. కలెక్టర్ బాలాజీ  (బహదూర్) విజయవాడ , మహానాడు: గూడూరు మండలంలో పటాన్ పేట, జమ్మిరామరాజుపాలెం  గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పటాన్ పేట, రామరాజుపాలెం అంగన్వాడి కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ చిన్నారుల హాజరు పట్టి పరిశీలించారు, పిల్లల బరువు, ఎత్తు నమోదు రిజిస్టర్ పరిశీలించి ఒకరిద్దరు చిన్నారుల బరువు స్వయంగా పరిశీలించారు. ఈరోజు  మెనూలో చిన్నారులకు అన్నం, ఉడికించిన […]

Read More

ఎమ్మెల్యేని అభినందించిన ముఖ్యమంత్రి 

జడ్చర్ల, మహానాడు: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో  ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల  విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జడ్చర్ల నియోజకవర్గంలో 27 వేల మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచితంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంతంగా అందజేశారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

Read More

రేవంతన్నగా ఎప్పుడూ అండగా  ఉంటా

ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం  హైదరాబాద్, మహానాడు: నిరుద్యోగులకు, విద్యార్థులకు నా సూచన ఒక్కటే. మీకు సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించండి. మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటానని  రేవంత్ రెడ్డి అన్నారు. ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న  యువకులకు నా శుభాకాంక్షలు. శిక్షణ పూర్తి […]

Read More