-సుమారు రూ.100కోట్ల విరాళాన్ని ప్రకటించిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షణ కమిటీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం తగు సహాయక చర్యలను సైతం వేగవంతం చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని గుర్తు చేశారు. అయినప్పటికీ విపత్తు భారీగానే నష్టాన్ని కలిగిచిందన్నారు. […]
Read Moreనెల్లూరు ఎంపీ రూ. కోటి విరాళం
నెల్లూరు, మహానాడు: వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన సీఎం చంద్రబాబుకు అందజేశారు. కాగా వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలనుకునేవారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఐఏఎస్ అధికారి మనీ జీర్(79067 96105)ను స్పెషల్ ఆఫీసర్గా నియమించింది.
Read Moreబెజవాడపై బ్రహ్మంగారి మాట నిజమవుతోందా?
(వాసు) వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం చెప్పారు. ఆయన ఇప్పటికి అయిదు వందల ఏళ్ళ క్రితం వారు. ఆనాడు ఆయన చెప్పిన అనేక జోస్యాలు తరువాత కాలంలో నిజం అయ్యాయి. జనాలను నిశ్చేష్టులను చేశాయి. అలాంటి జోస్యమే ఒకటి ఆయన విజయవాడ మీద కూడా చెప్పారు. బెజవాడలో కృష్ణానది ఉప్పొంగి కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది అని బ్రహ్మం గారు ఆనాడు రాశారు. ఇపుడు […]
Read Moreవైసీపీ నేతల ఇసుక దందాతో బుడమేరుకు గండ్లు!
• గత ఐదేళ్ళు బుడమేరు ఎరుగని జగన్ • నేడు ప్రభుత్వంపై బురద చల్లేందుకు వచ్చారు • విపత్తుల సమయంలో జగన్ బాధితుల పక్షాన నిలబడలేదు • ఐదేళ్ల పదవీకాలంలో సాయంత్రం 5 తరువాత బయటకు రాని జగన్ • ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజా హితం కోరాలి • జగన్ రెడ్డి ఫేక్ ప్రచారం మానుకోవాలి… విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి • చంద్రబాబు ఇంటికోసం బుడమేరు నీరు డైవర్ట్ […]
Read Moreఆహార పొట్లాలు పంపిణీ చేసిన మంత్రి సవిత
విజయవాడ, మహానాడు: విజయవాడ 55 డివిజన్ లో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మంగళవారం పర్యటించారు. ఇంటింటికీ వెళ్ళి ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. వరద బాధితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వరద తగ్గే వరకు సమీప పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని మంత్రి కోరారు.
Read Moreకేసీఆర్.. ఎక్కడ?
– వరదసాయంలో కనిపించని వైనం – తెలంగాణలో ఫాంహౌస్కే కేసీఆర్ పరిమితం – హైదరాబాద్, ఖమ్మంలో మినహా కనిపించని గులాబీదళం – అమెరికా నుంచి సర్కారు సాయంపై కేటీఆర్ విమర్శల ట్వీట్లు – హాస్టళ్లలో హరీష్రావు పర్యటనలు – వానలోనూ బాబు-రేవంత్ పర్యటనలు, పరామర్శలూ – విపత్తులోనూ బయటకు రాని కేసీఆర్పై విమర్శలు – ఆపన్నులకు సాయం బీఆర్ఎస్ సాయం చేయదా? -సోషల్మీడియాలో తడిసిముద్దవుతున్న కేసీఆర్ ( మార్తి సుబ్రహ్మణ్యం) […]
Read More121 ఏళ్ల చరిత్రలోనే అతి పెద్ద వరద
– సీఎంవో ట్వీట్ విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి 121 ఏళ్ల చరిత్రలో ఇదే అతి పెద్ద వరద అని సీఎంవో ఆంధ్రప్రదేశ్ ట్వీట్ చేసింది. 1903, 2009లో అత్య ధికంగా పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం దాటగా ఇప్పుడు ఏకంగా 11.36 లక్షల క్యూసెక్కులు దాటేసినట్లు తెలిపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తీర్చడానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను సమర్థవంతంగా నడిపిస్తున్నారని పేర్కొంది.
Read Moreమరో 11 జిల్లాలకు భారీ వర్ష సూచన
– ముందస్తు చర్యలపై ఆ 11 జిల్లాల కలెక్టర్లు, ఎస్.పీ లతో సి.ఎస్. టెలీకాన్ఫరెన్స్ హైదరాబాద్: రేపు కూడా రాష్ట్రంలోని దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రానున్న 24 గంటలలో భారీ వర్షాలు కురిసే హెచ్చరికలున్న 11 జిల్లాలైన ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, […]
Read Moreరేవంత్ సర్కార్ మొద్దు నిద్ర
– వరద బాధితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పందన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్: వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వరదలతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతుంటేమొద్దు నిద్ర పోతున్నది రేవంత్ సర్కార్. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ దొరుకుతుంది. కానీ వరదలో చిక్కుకున్న ప్రజలకు కాపాడేందుకు హెలికాప్టర్ దొరకదా? కేసీఆర్ పాలనలో […]
Read Moreదేవుడిపై భారం వేసే ప్రభుత్వంతో ఏం ప్రయోజనం?
తెలంగాణ లో వరదలు బాధించాయంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై కేటీఆర్ ఆగ్రహం ప్రజల ప్రాణాలు కాపాడటంలో, వరద సహాయక చర్యల్లో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ మండిపాటు ప్రకటనలతో సరిపెట్టకుండా తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీ ప్రభుత్వం నిర్వాకం బయటపడుతుందన్న కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణ లో వరదల బారి నుంచి ప్రజలను కాపాడి వారికి భరోసా కల్పించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. […]
Read More