ఐటీ పరిశ్రమల స్థాపన కోసం టాప్-10 పారిశ్రామికవేత్తలతో చర్చిస్తాం

– ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులతో మంత్రి లోకేష్ ఉండవల్లి, మహానాడు: రాష్ట్రంలో ఐటీ అభివృద్థి, పరిశ్రమల స్థాపన కోసం దేశంలోని టాప్-10 పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నట్టు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. పెట్టుబడిదారులను ఆకర్షించడం, మౌలిక సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చించారు. రియల్ టైం గవర్నెన్స్ ను(ఆర్టీజీఎస్) మరింత మెరుగ్గా […]

Read More

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు

కర్నూలు, మహానాడు: ఎమ్మిగనూరు మండలం, కందనాతి మాచమానదొడ్డి గ్రామం మలుపు దగ్గర గురువారం ఉదయం 9 గంటల సమయంలో బైకు, ఆటో ఢీకొన్న సంఘటనలో ఎస్ఐకి ఒక కాలు విరిగిపోయింది. రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ బాల నాయక్‌ స్కూల్‌ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నాయక్ ను చికిత్స కోసం హుటాహుటిన కర్నూలు మెడికల్ కళాశాలకు తరలించారు.

Read More

జగన్‌ ప్రభుత్వంలో మున్సిపల్ సిబ్బందికి తీవ్ర అన్యాయం

• ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పథకాలను కట్ చేసిన వైనం • లబోదిబోమంటూ గ్రీవెన్స్ లో అర్జీలు ఇస్తున్న వైసీపీ బాధితులు విజయవాడ, మహానాడు: జగన్‌ ప్రభుత్వంలో మున్సిపల్ సిబ్బందికి తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు బాధితులు బోరుమన్నారు. తమకు న్యాయం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీలు ఇచ్చారు. తాము విజయవాడ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో భాగమైన […]

Read More

కృష్ణమ్మ పరవళ్లను ఆసక్తిగా తిలకించిన సీఎం

విజయవాడ, మహానాడు: విజయవాడలో బుధవారం చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగి సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణమ్మ పరవళ్లును ఆసక్తిగా తిలకించి పరవశించిపోయారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి ముచ్చటించారు. కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యనించారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో […]

Read More

6,840 ఎకరాల భూమిని రూ. 529 కోట్లకు కొట్టేయాలని కుట్ర!

ఏపీఐఐసీ భూములైనా పట్టించుకోని వైనం • బ్యాంకులు ఎవరితో చేతులు కలిపాయో బయట పెట్టాలి • కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి – టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మంగళగిరి, మహానాడు: జగన్ ఐదేళ్ల పాలనలో పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాడు లేపాక్షి భూముల్లో ఈడీ కేసుల్లో ఇరుక్కున్న జగన్… 2019లో అధికారంలోకి వచ్చాక ఆ 8,884 ఎకరాల భూములను కారు చౌకగా రూ.500 కోట్లకు […]

Read More

గురు చూసి దెబ్బ కొట్టింది

పతకం రికార్డుతో వినేశ్ ఫోగట్ పంచ్‌ ప్రశంసల వర్షం (వాసు) ఏడాది క్రితం ఆమెను రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళారు. పోలీసులతో దెబ్బలు తింది.న్యాయం కోసం రోడ్ల మీద ధర్నా చేసింది. అరెస్ట్ అయింది..వేధింపులకు గురయింది. దీంతో కెరీర్ ఖతం అయిపోయింది అనుకున్నారు అందరూ. విద్వేషకారులు విషం చిమ్ముతునా తన పోరాటం ఆపలేదు. వెనుకడుగు వేయలేదు. సహచరులకు జరిగిన అన్యాయాను ఎదురిస్తూనే..తన పంచ్‌లకు పదును పెట్టుకుంది.తప్పు చేసిన వారి తలలు […]

Read More

జగన్ ఆఫీసు విజయవాడకు తరలింపు

విజయవాడ: తాడేపల్లిలోని జగన్ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని విజయవాడకు మార్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన మీడియా గదులు, కాన్ఫరెన్సు హాల్ లను మంగళవారం లేల్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ, మందపాటి శేషగిరిరావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్నటువంటి కార్యాలయాన్ని విజయవాడకు మార్చడం జరిగిందన్నారు. ఈనెల పది నుంచి జగన్ ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇలా చేశామన్నారు.  

Read More

పదేళ్ల తర్వాత మళ్లీ ఆ అదృష్టం

– కొండపై విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు పదేళ్ల తర్వాత మళ్లీ.. కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం విష్ణు పుష్కరిణిని శుభ్రం చేసి.. స్నానాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 11వ తేదీ స్వాతినక్షత్రం రోజున ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు.. ఆలయ ఈవో భాస్కర […]

Read More

రఘురామరాజు.. సీఐడీ దెబ్బలు.. ఒక క్విడ్ ప్రో కో!

– గుంటూరులో డాక్టర్ ప్రభావతి బిల్డింగ్.. ప్రత్యేకం! – రఘురామకృష్ణంరాజును చిత్రహింలు పెట్టిన నాటి సీఐడీ – ఆయనకు గాయాలేమీ లేవని సర్టిఫై చేసిన డాక్టర్ ప్రభావతి – సంబంధం లేని వైద్యులతో రఘురామరాజుకు వైద్య పరీక్షలు – కేసు షీటు కూడా ఇవ్వని దారుణం – గుంటూరు వైద్యుల నివేదికను కొట్టిపారేసిన సికింద్రాబాద్ మిలటరీ వైద్యులు – కాళ్లకు గాయాలయ్యాయని ధృవీకరణ – డాక్టర్ ప్రభావతి భర్త వైసీపీలో […]

Read More

బీపీ మండల్ ఆశయాల సాధన కోసం పోరాటం

– బీపీ మండల్ డే లో బీసీవై పార్టీ అధ్యక్షులుడు రామచంద్ర యాదవ్ రాజమండ్రి, మహానాడు: బీపీ మండల్ ఆశయ సాధనకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. మండల్ కమీషన్ సిఫార్సులు అమలు చేసి, పూర్తిస్థాయిలో కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.. కులగణన కోసం తమ పార్టీ అన్ని రకాలుగా పోరాటం చేస్తుందని చెప్పారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి “బీపీ […]

Read More