పారిస్ ఒలింపిక్స్లో అరకు కాఫీ ఘుమఘుమలు – అతిథులను అలరించనున్న మన్యం పంట – అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన చంద్రబాబు ( ఏ.బాబు) విశాఖపట్నం: వేడివేడిగా పొగలు కక్కే కాఫీ తాగడమంటే చాలామందికి ఇష్టం. దాదాపు చాలా మందికి కాఫీ గుబాళింపుతోనే శుభోదయం మొదలవుతుందంటే అతిశయోక్తి కాదేమో. రాష్ట్రంలోని అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. తాజాగా అలాంటి అరకు కాఫీ ఒలింపిక్స్లో అతిథులను అలరించనుంది. […]
Read Moreఅబ్దుల్ కలాం ఆశయాలను కొనసాగిద్దాం
ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: డాక్టర్ అబ్దుల్ కలాం ఆశయాలను యువత కొనసాగించాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టణ కార్యాలయంలో డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం దేశానికి ఎనలేని సేవ చేశారన్నారు. ఆదర్శ […]
Read Moreపోరాటాల ఫలితంగానే వైకాపా పరాజయం
పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ద్వారా ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోరపరాజయం పాలైందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ అన్నారు. పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం నుంచి పార్లమెంట్ కు, శాసనసభకు ఎన్నికైన నాయకులకు సన్మాన కార్యక్రమం బాలోత్సవ భవన్లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన […]
Read Moreవ్యవసాయంపై ఒక్క మంత్రికీ అవగాహన లేదు
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హైదరాబాద్: వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా కోసమే పుట్టినట్లు గతంలో పాలకులు వ్యవహరించారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. నీళ్లు ఎలా లిఫ్ట్ చేయాలో తెలిసే కేసీఆర్ కన్నెపల్లి […]
Read Moreపెద్దిరెడ్డి ఈ సవాల్ కాసుకో..
మిథున్ రెడ్డి ఓ శుద్ధపూస * ఓటమితో వైసీపీకి బుద్ధి రాలేదు * పెద్దిరెడ్డి దోపిడీలు భూములు, గనులు, ఇసుక, విద్యుత్తు అన్నింటా… బీసీ యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తిరుపతి: గత అయిదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భూములను తమ సొంత ఆస్తులలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు పంచుకుని తిన్నారని బీసీ యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర […]
Read Moreమంత్రి నారాయణను కలిసిన కమిషనర్లు
అమరావతి, మహానాడు: మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను పలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్ లు ఉన్నారు.
Read Moreఆంధ్రప్రదేశ్ ప్రజలపై రుణ భారం ఎంత?
రాష్ట్ర రుణభారం రూ.9,74,556 కోట్లు ఉన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం ద్వారా శాసనసభలో వెల్లడించారు. అందులో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్, వార్షిక బడ్జెట్ పత్రాలలో ప్రస్తావించే ఆంధ్రప్రదేశ్ రుణ భారం రు.7,67,869 కోట్లు ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రు.7,48,612 కోట్లు ఉన్నదని, శాసనసభకు హాజరు కాకుండా ప్రసారమాధ్యమాలకు తెలియజేశారు. రెండింటి మధ్య తేడా రు.19,257 కోట్లు. అదనంగా, పౌర సరఫరాల శాఖకు మరియు […]
Read Moreవృక్షాలను విధ్వంసం చేయకండి
– జన చైతన్య వేదిక గుంటూరు, మహానాడు: రోడ్ల విస్తరణ, ఆధునీకరణ పనుల్లో వేలాది చెట్లను కోల్పోతున్నామని, స్థానికంగా దుబాయ్ మొక్కగా పిలిచే కోనోకార్పస్ వృక్షాలను తొలగించవద్దని జన చైతన్య వేదిక పేర్కొంది. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్, నేస్తం సహ వ్యవస్థాపకులు టి.ధనుంజయ రెడ్డి, తెలుగు భాషోద్యమ కన్వీనర్ డాII వి.సింగారావుతో పాటు, జన చైతన్య […]
Read Moreతెలంగాణలో మళ్లీ ఎల్.ఆర్.ఎస్
– ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎల్.ఆర్.ఎస్ ప్రత్యేక టీముల ఏర్పాటుకు చర్యలు – దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని సూచనలు – అధికారులతో సమీక్ష సందర్భంగా ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పటిష్టంగా లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ (ఎల్.ఆర్.ఎస్)ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, […]
Read Moreరుణమాఫీ దేవుడెరుగు.. వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు
– ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని […]
Read More