ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచనలు

విశాఖపట్నం: కోస్తాంధ్ర, రాయలసీమలను చుట్టుముట్టిన వేడి తరంగాల ప్రస్తుత దశకు ముగింపు పలికి మే 7 నుంచి మే 9 వరకు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అమ రావతి ఐఎండీ నివేదిక పేర్కొంది. ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

Read More

థ్యాంక్స్‌ మై ఫ్రెండ్‌ చంద్రబాబు: ప్రధాని మోదీ

అమరావతి: తనకు స్వాగతం చెబుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. థ్యాంక్స్‌ మై ఫ్రెండ్‌ చంద్రబాబు గారూ.. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుని రాజమండ్రికి వెళుతున్నా. సాయంత్రం అనకాపల్లి ర్యాలీలో పాల్గొంటా. ఏపీ మొత్తం ఎన్డీయేతోనే ఉంది అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి జోరుపై మరో ట్వీట్‌ ప్రధాని మోదీ ఏపీ రాజకీయాలపై మరో ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో […]

Read More

భారత్‌-నేపాల్‌ సరిహద్దు మూసివేత

బిహార్‌: లోక్‌సభ ఎన్నికల మూడో దశ నేపథ్యంలో బీహార్‌ను ఆనుకుని ఉన్న నేపాల్‌ సరిహద్దును మూడు రోజుల పాటు మూసివేశారు. సరిహద్దు ప్రాంతాలైన మధు బని, ఖుటోనా, జయనగర్‌ నుంచి నేపాల్‌ మీదుగా వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. మంగళవారం బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సరిహద్దులను మూసివేశారు. మరోవైపు సరిహద్దు వద్ద భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు.

Read More

గడ్చిరోలిలో పేలుడు పదార్థాలు స్వాధీనం

మహారాష్ట్ర: గడ్చిరోలిలోని టిపగడ్‌ ప్రాంతంలో సోమవారం భద్రతా దళాలకు అందిన సమాచారం ప్రకారం పేలుడు పదార్థాలు, క్లైమోర్‌మైన్‌ల కోసం వెతకడానికి సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పేలుడు పదార్థాలు, డిటోనేటర్లతో నిండిన ఆరు ప్రెజర్‌ కుక్కర్లు, ష్రాప్‌ నెల్స్‌తో నిండిన మూడు క్లైమోర్‌ పైపులను కూడా కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల దృష్ట్యా అలజడి సృష్టించేందుకు మావోయిస్టు లు వాటిని అమర్చి ఉంటారని భావిస్తున్నారు.

Read More

పోస్టల్‌ బ్యాలెట్‌ బదులు ఈవీఎంతో ఓటింగ్‌

చిలకలూరిపేటలో ఎన్నికల అధికారి తప్పిదం ఓట్లు చెల్లుబాటు అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఈసీదే మే 14న చెన్నై తెలుగు విద్యార్థుల పరీక్షను రీ షెడ్యూల్‌ చేయాలి ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేత వర్ల రామయ్య వినతి మంగళగిరి, మహానాడు : చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌కు పేపర్లు ఇవ్వాల్సింది పోయి ఎన్నికల అధికారి అయిన తహసీల్దారు ఏకంగా ఈవీఎంను ఉపయోగించారని, వారు చేసిన తప్పుకు ఓట్లు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవా […]

Read More

అనంతపురం డీఐజీపై బదిలీ వేటు

అనంతపురం, మహానాడు : అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరి స్తున్నారని, వైసీపీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని టీడీపీ నాయకులు ఇటీవల ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఎన్నికల విధులు అప్పగించొద్దని ప్రభుత్వానికి సూచించింది. ఆయన స్థానంలో ప్రత్యామ్నాయంగా నియామకానికి పలువురి పేర్లను సిఫారసు చేస్తూ ప్రతిపాదనలు పంపాలని […]

Read More

ఓటమి భయంతో వైసీపీ గూండాల దాడులు

ఎన్ని అడ్డంకులు సృష్టించినా గెలిచేది కూటమే టీడీపీ నాయకులపై దాడి, కారు ధ్వంసం హేయం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : ఓటమి భయంతోనే వైకాపా గూండా నాయకులు దాడికి దిగుతున్నారని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కుంకలగుంట తెలుగుదేశం పార్టీ నాయకులపై వైకాపా గుండాల దాడిని ఖండిరచారు. సోమవారం దాడి జరిగిన ప్రదేశాన్ని, ధ్వంసమైన కారును ఆయన పరిశీలించారు. టీడీపీ నాయకులు […]

Read More

బ్యాలెట్‌ ఓటింగ్‌ దగ్గర వైసీపీ మూకలు

– నిబంధనలకు విరుద్ధంగా బూత్‌లలోకి ప్రవేశం – వారి అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నాం – ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాం – టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ నరసరావుపేట, మహానాడు : వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని, ఓటమి భయంతోనే ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా అరాచక చర్యల కు పాల్పడుతున్నారని నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు మండిపడ్డారు. నరసరావుపేట […]

Read More

రేపిస్టు ప్రజ్వల్‌ రేవణ్ణకు మోదీ ప్రచారం

మహిళలను అగౌరవపరిచి ఇప్పుడు బేటీ పడావో అంటున్నారు రేవంత్‌పై ఢిల్లీ పోలీసులు పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవాలి లేకుంటే తెలంగాణ తడాఖా చూపిస్తాం రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఖమ్మం/హైదరాబాద్‌, మహానాడు : ఇటీవల సెక్స్‌ స్కాండల్‌లో ఇరుక్కున కర్నాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను గెలిపించాలని మోదీ ప్రచారం చేశారని, మహిళలను అగౌరవపరచడం బీజేపీకి కొత్త కాదని కాంగ్రెస్‌ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి విమర్శించారు. ఆమె సోమవారం […]

Read More

మన రాజధాని, మన భవిష్యత్‌ మనమే నిర్మించుకుందాం

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : ముప్పాళ్ల మండలం తురకపాలెం, దమ్మాలపాడు గ్రామాలలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కన్నా మాట్లాడుతూ ఒక రాజధాని నిర్మించే సత్తా లేనోడు మూడు రాజధానులు కడతా అని చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని విమర్శించారు. మన రాజధాని, మన భవిష్యత్‌ మనమే నిర్మించుకుందామని […]

Read More