మైదుకూరు వైసీపీ అభ్యర్థికి షర్మిల కౌంటర్ కడప జిల్లా మైదుకూరు, మహానాడు: మైదుకూరులో కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిలా రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వివేకా కుమార్తె సునీతారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మైదుకూ రు ఎమ్మెల్యేపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మైదుకూరు ఎమ్మెల్యే నియోజక వర్గంలో ఎప్పుడైనా కనిపించాడా? ఎవరికైనా సహాయం చేశాడా? ఉపయోగపడని ఎమ్మెల్యే ఎందుకు ? ఈయన ప్రెస్ మీట్ పెట్టి […]
Read Moreఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు
అమరావతి, మహానాడు: ఎన్నికలకోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని సెక్రటేరియట్లో సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. కృష్ణా యూనివర్శి టీలో వైస్ చాన్సలర్ జ్జానమణి వైసీపీ రంగులు, సీఎం జగన్మోహనరెడ్డి, బొత్సా సత్యనారాయణ ఫొటోలు కలిగి ఉన్న డైరీని అక్కడ ఉద్యోగులకు పంచారని, తిరుపతి వెంకటేశ్వర యూనివ ర్శిటీలో రిజిస్ట్రార్ పీఏగా పనిచేస్తున్న మురళీరెడ్డి, డ్రైవర్ అయ్యప్ప వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని […]
Read Moreకూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి
తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని జనసేన తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక బోస్ రోడ్డులోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల సమన్వయ సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశంలో పార్టీల నేతలు పాల్గొని ఎన్నికల్లో అనుసరించాల్సిన పలు అంశాలపై […]
Read Moreతుస్సుమన్న జగన్ వినుకొండ బస్సు యాత్ర
ఊదరగొట్టి ఉసూరుమనిపించారు! జనం లేక మాట్లాడకుండానే వెళ్లిన అధినేత నిరుత్సాహానికి గురైన వైసీపీ శ్రేణులు వినుకొండ, మహానాడు: అడుగో వస్తున్నాడు.. ఇదిగో వచ్చాడు.. అంటూ పెద్ద ఎత్తున అధికార పార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఎంపీ అనిల్కుమార్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వారం రోజులుగా సోమవారం జరిగే సిద్ధం సభకు జన సమీకరణ చేశారు. అనుకున్న ప్రకా రం ఎంతో కొంత ఐదు మండలాల నుంచి వైసీపీ శ్రేణులు […]
Read Moreపదవులు కాదు..సామాజిక న్యాయం ముఖ్యం
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, మహానాడు:పదవులు కాదు..సామాజిక న్యాయం, ఆత్మగౌరవం ముఖ్యమని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పిన ఆయన నామ మాత్రం పదవులు ఇచ్చి అన్ని వర్గాలను కీలుబొమ్మలుగా చేశారని, పదవులు కాదు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం ముఖ్యమని చెప్పుకొచ్చారు. యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ […]
Read Moreజగన్ ఓటమి…కూటమి గెలుపే మాదిగల లక్ష్యం
ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు గుంటూరు, మహానాడు: మాదిగలకు రాష్ట్రంలో ప్రథమ శత్రువు జగన్మోహన్రెడ్డి అని, ఆయన ఓటమికి పనిచేస్తామని, కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేస్తామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో మాదిగలు వైసీపీ ఓటమికి, ఆ పార్టీపై పోరాటం చేయటానికి సిద్ధంగా […]
Read Moreదర్శిని అభివృద్ధి పథంలో నడిపిస్తా
టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: దర్శి పట్టణంలో 19వ వార్డులో టీడీపి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి సోమవారం ఉదయం చేపట్టిన ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. మహిళలు పెద్దఎత్తున ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. సీనియర్ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు సహకారంతో దర్శి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, ఎంపీ అభ్యర్థి మాగుంటతో కలిసి పట్టణంలో మంచినీటి కష్టాలు […]
Read Moreఅధికారం లేకున్నా పవన్ సేవ అద్భుతం
పవన్ను చూసి గర్విస్తున్నా చిరంజీవి ట్వీట్ పవన్ను చూసి గర్విస్తున్నా చిరంజీవి ట్వీట్ అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు.అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం.తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను.
Read Moreసత్య కుమార్ కు సందులు తెలియకపోవచ్చు.. సమస్యలు తెలుసు
-ధర్మవరం సందుల్లోనే వైసీపీకి బుద్ధి చెబుదాం -ఢిల్లీలో ఉండాల్సిన వ్యక్తి మన కోసం ధర్మవరం వచ్చారు -ఆయనను గెలిపించాల్సిన బాధ్యత మనదే -ముదిగుబ్బ మండల నాయకులు, కార్యకర్తలతో పరిటాల శ్రీరామ్ సత్య కుమార్ కి ధర్మవరం నియోజకవర్గంలో సందులు తెలియదని.. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎద్దేవా చేస్తున్నారని ఆయనకు అదే ధర్మవరం సందుల్లోనే సమాధానం చెబుదామని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ముదిగుబ్బ మండల నాయకులతో ఆత్మీయ పరిచయ […]
Read Moreఅమెరికాలో భద్రాచలం రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు, దాతల సహకారంతో 33 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆలయ పనులు చేపట్టినట్లు వివరించారు. తోటి అర్చకులతో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులతో పాటు కొంతమంది వైదిక పెద్దలను కలిసి సలహాలు తీసుకున్నారు. అట్లాంటాలో రామాలయ పనులు సాగుతున్నాయని, […]
Read More