10 వేల మంది కార్మికులతో పారిశుద్ధ్యం నిర్వహణ

– మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావడానికి 10 వేల మంది కార్మికులు అవసరమని, నీరు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగు లేకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులపై మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రి ఏమన్నారంటే.. వరద ముంపు […]

Read More

సింగ్ నగర్ లో మృతదేహం!

విజయవాడ, మహానాడు: నగరంలోని సింగ్ నగర్ పైపుల్ రోడ్డు పక్క సందులో ఏ వన్ టీ స్టాల్ వద్ద మృతదేహం పడివుంది. మూడు రోజులుగా మృతదేహం నుండి దుర్వాసన రావడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అనారోగ్య కారణాలవల్ల మృతి చెంది ఉండొచ్చని, అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని స్థానికికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read More

రేపు జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదు

ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అమరావతి : కృష్ణా నది వరదల విపత్తు నేపథ్యంలో బుధవారం నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా నది వరదల కారణంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అపార నష్టం జరిగిందన్నారు. దీంతో యావత్తాంధ్రప్రదేశ్ తీవ్ర విషాదంలో కూరుకుపోయిందన్నారు. ఇటువంటి దు:ఖ సమయంలో […]

Read More

వరద సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

బాధితులను ఆదుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాం ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదు మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ విజయవాడ: క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులకు ఆహారం అందజేస్తున్నాం. విపరీతంగా వచ్చిన వరదతో మూడు రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారిని ఇబ్బందుల నుండి బయటకు తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా. 6 హెలికాప్టర్లు, 30 డ్రోన్లు తెప్పించి బాధితులకు ఆహారం అందజేస్తున్నాం. 179 సచివాలయవాల పరిధిలో…ఒక్కో […]

Read More

సాధారణ పరిస్థితులు వచ్చే వరకూ ప్రభుత్వం అండగా ఉంటుంది

ఆకలి, దప్పుులు లేకుండా అందరినీ ఆదుకుంటాం చంద్రబాబు ముందుచూపు, అనుభవంతో ప్రాణ నష్టం నివారించగలిగాం భవానీపురం వరద ప్రాంతంలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తూ హోంమంత్రి ఆహారం పంపిణీ అమరావతి; వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకూ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకలిదప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం […]

Read More

విజయవాడ కృష్ణలంక రిటైనింగ్ వాల్ ని ఎవరు కట్టారు?- నిజానిజాలు

(రమణ) నిజానికి కృష్ణలంకకు – కృష్ణా నదికి అడ్డుగా రీటైనింగ్ వాల్ 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశీలన, ఎస్టిమేషన్స్ కూడా జరిగాయి. 2011లో ఎస్టిమేషన్ రూ . 40 కోట్లు. తర్వాత 2014 కి 93.22 కోట్లు చేశారు. 2014లో విభజిత ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎస్టిమేట్లను రూ. 104 కోట్లకు పెంచి, 2014 లో టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు… రామలింగేశ్వర నగర్ నుంచి యనమల […]

Read More

వాట్సప్ గ్రూప్ అడ్మిన్లపై నజర్

– ఫేక్ న్యూస్ ఎవరు పోస్ట్ చేసినా అడ్మిన్ బాధ్యుడు -వరదలపై వదంతుల వ్యాప్తిపై సర్కార్ సీరియస్ – సహాయక చర్యలపై విష ప్రచారం చేసే వాళ్లపై చట్ట ప్రకారం చర్యలు ప్రకృతి విపత్తు వరదల రూపంలో విరుచుకుపడి విలయం సృష్టించింది. కష్ట సమయంలో ప్రభుత్వం సర్వశక్తులతో సహాయ చర్యలు చేపడుతోంది. కొందరు దురుద్దేశ పూర్వకంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. బాధితులకు సాయం అందించడంలో సమస్యలు ప్రభుత్వం దృష్టికి […]

Read More

భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్‌సేన్

తెలుగు రాష్ట్రాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణకు రూ.50 లక్షలు, ఏపీకి రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు మంగళవారం ట్విట్ చేశారు. ‘భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అని ఎన్టీఆర్ తెలిపారు. మరోవైపు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఏపీ […]

Read More

పొంచి ఉన్న గండం.. 5, 6 తేదీల్లో మరో అల్పపీడనం

సెప్టెంబర్ 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. ఇది తుపానుగా మారి.. విశాఖపట్నం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడనుందనే సమాచారం ముంపు ప్రాంతాల ప్రజలకు ఆందోళన […]

Read More

మార్కెట్లోకి బజాజ్ నుంచి కొత్త బైక్.. పెట్రోల్ అక్కర్లేదు!

బజాజ్ కంపెనీ కొత్తగా ఇటీవలే ప్రపంచంలోనే మొట్టమొదటి సారి CNG తో నడిచే బైక్ ను విడుదల చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అయితే ఇప్పుడు బజాజ్ మరో అడుగు ముందుకేసి ఇథనాల్ తో నడిచే ఈ ద్విచక్ర వాహనాన్ని అతి త్వరలో విడుదల చేయబోతోంది. ఈ బైక్లో 100 సీసీ ఇంజన్ ఉంటుంది. ఈ ఇథనాల్ బైక్ వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Read More