అధికారిక లాంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతారులతో సమీక్ష హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రామోజీరావు కుమారుడు కిరణ్, కోడళ్లు శైలజ, విజయేశ్వరిలను పరామర్శించి సానుభూతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో వాటి ఏర్పాట్ల గురించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి […]
Read Moreహైదరాబాద్లో పెట్టుబడులకు కోకాకోలాకు ఆహ్వానం
అట్లాంటాలో కంపెనీ డైరెక్టర్తో మంత్రుల సమావేశం ప్లాంట్ స్థాపిస్తే సహకారం అందిస్తామని వెల్లడి హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివా రం అట్లాంటాలోని కోకాకోలా హెడ్ క్వార్టర్స్లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనాథన్ రీఫ్తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోకా-కోలా మేనేజ్మెంట్ ను ఆహ్వానించారు. […]
Read Moreరామోజీ అంత్యక్రియలకు ఏపీ తరపున అధికారులు
అమరావతి: ఈనాడు, మార్గదర్శి గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రి యలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముగ్గురు సీనియర్ అధికారులు హాజరుకానున్నారు. ఆర్పీ సిసోడియా, సాయిప్రసాద్, రజత్ భార్గవ పాల్గొని రామోజీ పార్దీవ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించనున్నారు.
Read Moreపట్టుదల, అంకితభావానికి నిదర్శనం రామోజీరావు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో రామోజీరావుకు ఘన నివాళులర్పిం చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రామోజీరావు మృతి వ్యక్తిగతంగా చాలా కలచివేసింది. సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైన వ్యక్తిగా ఎదిగి పట్టుదల, అంకితభావంతో నమ్మిన సిద్ధాం తం కోసం పనిచేశారని కొనియాడారు. సుదీర్ఘకాలంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదని, వైసీపీ పాలనలో […]
Read Moreగుంటూరులో రామోజీరావుకు ఘన నివాళి
గుంటూరు: నగరంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా దిగ్గజం రామోజీ రావు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. తాడికొండ, ప్రత్తిపా డు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్కుమార్, బూర్ల రామాంజ నేయులు, గళ్లా మాధవి, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార రంగాలలో ప్రతిఒక్కరికి దారిచూపిన మార్గదర్శకుడు, దార్శనికుడని కొనియాడారు. రామో జీ ఫిల్మ్ సిటీ అనే అద్బుతాన్ని […]
Read Moreరవాణా మంత్రి పొన్నం రూ.100 కోట్ల కుంభకోణం
వే బిల్లులు లేకుండా బూడిద అక్రమ రవాణా రోజుకు 200 నుంచి 300 లారీల తరలింపు రోజుకు రూ.50 లక్షల పైనే అక్రమ సంపాదన వెంటనే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ తరలుతున్న ఫ్లై యాష్ లారీల పట్టివేత హుజురాబాద్: రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా సంస్థ అధికారులతో కుమ్మక్కై రోజుకు రూ.50 లక్షలు సంపాదిస్తున్నారని హుజురాబా […]
Read Moreనీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విచారణ జరిపించాలి
ఫలితాల్లో అవకతవలపై అనుమానాలున్నాయి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 5న దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పరీక్షను […]
Read Moreఅక్షర శిల్పి రామోజీ
చెరుకూరి రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థలకు అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనం లోని ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించింది. […]
Read Moreజగ్గయ్యపేటలో రామోజీకి నివాళి
జగ్గయ్యపేట: పట్టణంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య నివాసంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు ఎమ్మెల్యే తాతయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreదర్శిలో రామోజీరావుకు నివాళి
దర్శి: టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం రామోజీరావు చిత్రపటానికి దర్శి టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, బీజేపీ నాయకులు మాడపాకుల శ్రీను, తిండి నారాయణరెడ్డి పాల్గొన్నారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మీడియా రంగంలో ఎన్నో సవాళ్లను అధిగమించి విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతిఒక్కరికీ ఆదర్శనీయమని, మీడియా రంగంలో ఆయన ఒక శిఖరమని పేర్కొన్నారు.
Read More