భూ కబ్జా రాయుడు బొల్లా ఇంటికే.. వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ: పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు జి.వి. ఆంజనే యులు, మక్కెన మల్లికార్జునరావు సోమవారం విలేఖరుల సమావేశం నిర్వహిం చారు. ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మంగళవారంతో తొలగిపోతుందన్నారు. కూటమికి 150 పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ సర్వే లు చెప్పాయన్నారు. అధికారులను బయపిస్తున్న సజ్జల రామకృష్ణ, పేర్ని నానిని జైలులో వేయాలని […]
Read Moreబురఖాలో విచారణకు హేమ..అనంతరం అరెస్ట్
బెంగళూరు: రేవ్ పార్టీ కేసులో సినీనటి హేమ ఊహించని విధంగా బురఖా వేసుకుని సోమవారం బెంగళూరులో విచారణకు హాజరయ్యారు. దాంతో సీసీబీ పోలీసులు ఆశ్చర్యపోయారు. విచారణ అనంతరం హేమను అరెస్టు చేసినట్లు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ధృవీకరించారు.
Read Moreడీఎస్పీ హోదాలో ఉన్నా కులవృత్తిని మరువలేదు!
రాజన్న సిరిసిల్ల: కుల వృత్తి కులానికి గౌరవం ఇస్తుంది.. అందులో ఉండే సంతృప్తి సంతోషమే వేరు. పోలీసు వృత్తిలో ఉన్నా కుల వృత్తిపై ప్రేమతో కొలిమి లో పనిచేసి వృత్తికి గౌరవం తెచ్చారు వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలోని ఓ కమ్మరి కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసి ఆశ్చర్యపరిచారు. ఉన్నతస్థాయిలో ఉన్నా కుల వృత్తిని మరచిపోలేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Read Moreతెలంగాణ సెక్రటేరియట్లో వాస్తు మార్పులు
హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్లో వాస్తు మార్పులు చేయిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి సీఎం కాన్వాయ్ లోపలకు వచ్చేది. ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి, నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయ టకు వెళుతుంది. సౌత్ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరుగుతాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వాస్తు మార్పులు చేయిస్తున్నారు.
Read Moreఅమిత్షా, కిషన్రెడ్డిపై కేసు నమోదు చేయాలి
ఎఫ్ఐఆర్లో వారిని చేర్చకపోవడం సరికాదు ఎన్నికల కమిషన్ విచారించి రిపోర్ట్ పంపాలి టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ హైదరాబాద్: బీజేపీ ఎన్నికల ప్రచారంలో మే 1న హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి ప్రచారంలో చిన్నారులను తీసుకురావడంపై మొఘల్పురా స్టేషన్లో కేసు నమో దైందని, దీని మీద ఎన్నికల కమిషనర్ విచారణ చేసి రిపోర్ట్ పంపాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు. అయితే రాజాసింగ్, మాధవిలతపై కేసు నమోదు చేశామని చెబుతున్నారు. కానీ ఆ […]
Read Moreనయా సర్కారుకు.. నయా కష్టాలే!
– ఏపిలో కొత్త ప్రభుత్వానికి సవాలే.. – అది వైసీపీ ఐతే ఒకలా? టీడీపీ కూటమి ఐతే ఇంకోలా? (నాయక) జూన్ 9 నుంచి కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభం కానుంది. అయితే ఇచ్చిన హామీలు, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అమలు ఆషామాషీ విషయం కాదు. కనీసం కొత్త ప్రభుత్వం కుదుటుపడాలంటే, పాలన గాడిలో పడాలంటే దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టడం ఖాయం. జగన్ అధికారంలోకి వస్తే.. […]
Read Moreఅంతా గప్..చుప్
– ఆరు వేల కోట్ల అదానీ స్కాంపై ఊసే లేదు – నాసిరకం బొగ్గు కొని నాణ్యమైన సరుకుగా అమ్మకం – 2014లోనే జరిగినా స్పందించని తమిళ పార్టీలు, ప్రభుత్వం – సార్వత్రికంలో ప్రధాన పార్టీల నేతలు సైలెంట్ – బొగ్గు అక్రమాలపై విచారణకు సీపీఐ(ఎం) డిమాండ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఓ మీడియా సంస్థ ఆరు వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టింది. […]
Read Moreఅన్నింటికీ అదే సమాధానం వస్తుంది..
అమరావతి పై గొప్పగా ప్రచారం చేసినా రాజధాని ప్రాంతంలో ఒక్క సీటు గెలవలేదు పరుగులు పెట్టించిన పోలవరంలో సీటు గెలవలేదు కియా తెచ్చిన అనంతపురం జిల్లాలో పట్టు పోయింది పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చినా యువత జగన్ వైపు మంచి ఫిట్మెంట్ జీతాలు ఇచ్చినా ఉద్యోగులు జగన్ వైపు గత వైఖరికి భిన్నంగా బాబు జలప్రాజెక్టులు పూర్తి చేసినా కొంత ఋణమాఫీ చేసినా రైతులు జగన్ వైపు ఇలా కొన్ని గొప్పగా […]
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేణుకా చౌదరి
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలోవేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా,టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల రేణుకా చౌదరి మాట్లాడుతూ శ్రీవారి దర్శనం బాగా జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని, రైతులకు పంటలు బాగా పండి దేశం బాగా ఉండాలని ప్రార్థించానన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం సేవలందిస్తూనే ఉంటుందని […]
Read Moreఎవరి ధీమా వారిదే
– టెన్షన్.. అ ‘టెన్షన్’ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా సాగడమే ఇందుకు ప్రధాన కారణం. పోలింగ్ ముగిసిన వెంటనే విజేతలు ఎవరనే దానిపై మొదలైన సస్పెన్స్.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్తో దీనిపై ఓ స్పష్టత వస్తుందని భావించినా.. అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పలు ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే విజయం […]
Read More