– ఈ ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు స్వర్ణయుగమే. – నేతన్నల సంక్షేమంపై గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి – చేనేత కార్మికుల కుటుంబ సభ్యులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు – రాష్ట్ర చేనేత, జౌళి; బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారి నేతృత్వంలోని ప్రభుత్వం కృషిచేస్తోందని గౌరవ రాష్ట్ర చేనేత, జౌళి; […]
Read Moreజంగిల్ క్లియరెన్స్ పనులకు ప్రభుత్వం శ్రీకారం
30 రోజుల్లోగా ముళ్ల కంపలు తొలగించేలా ముందుకెళ్తున్నాం వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటలో అమరావతికి తీరని నష్టం త్వరలో ఐఐటీ నిపుణుల ప్రాథమిక నివేదిక ఐదేళ్లుగా నిర్జీవంగా పడి ఉన్న ఆంధ్రుల రాజధాని అమరావతి కొత్త కళ సంతరించుకోనుంది..గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో దట్టమైన అడవిని తలపించేలా ఏపుగా పెరిగిపోయిన తుమ్మ చెట్లు,ముళ్ల కంపలతో భూములిచ్చిన రైతులు కూడా తమ భూమి ఎక్కడ ఉందో తెలుసుకోలేని పరిస్థితి […]
Read Moreబీపీ మండల్ ఆశయాల సాధన కోసం పోరాటానికి సిద్ధం
* కులగణన చేయకపోతే అన్ని వర్గాలకు నష్టం! * బిపి మండల్ డే వేడుకల్లో బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ * రాజమండ్రిలో మండల్ విగ్రహావిష్కరణ బీపీ మండల్ ఆశయ సాధనకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.. మండల్ కమీషన్ సిఫార్సులు అమలు చేసి, పూర్తిస్థాయిలో కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.. కులగణన కోసం తమ పార్టీ అన్ని […]
Read Moreరేవంత్ రెడ్డి తన తమ్ముళ్లను తెలంగాణ మీదకు వదిలారు
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపణ హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్, బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, రాజేష్ నాయక్ లు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అవినీతి, అధికార దుర్వినియోగం పై దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ […]
Read Moreచేనేత కళాకారులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు
విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మంగళగిరితో ముడిపడిన బంధం నన్ను చేనేత కుటుంబసభ్యుడిని చేసింది. చేనేత కళాకారుల కష్టాలు చూశాను. సమస్యలపై పూర్తి అవగాహన వచ్చింది. యువగళం పాదయాత్రలో చేనేత రంగం లక్షలాది మంది జీవనానికి ఉపయోగపడటమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే ఓ కళ అని పూర్తిస్థాయి అవగాహన కలిగింది. చేనేతరంగానికి […]
Read Moreసీఆర్డీయే రైతు కూలీ పెన్షన్ అందించి ఆదుకోవాలి
నష్టపరిహారం చెల్లించకుండా గత వైసీపీ ప్రభుత్వం ఇంటిని కూల్చేసింది వారసత్వంగా వచ్చిన మూడెకరాల అసైన్డ్ భూమిని వైసీపీ అండతో కబ్జా చేశారు 22వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు వినతుల వెల్లువ అమరావతి: సమస్యలు పరిష్కరించాలంటూ ఉండవల్లిలోని విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు వినతులు వెల్లువెత్తాయి. మంత్రి లోకేష్ ను నేరుగా కలిసి సమస్యలు విన్నవించేందుకు జోరువానను సైతం లెక్క చేయకుండా […]
Read Moreకారుకు సైడ్ ఇవ్వలేదని…యువకుడిని చంపేశారు
ఈపూరుపాలెంలో కిరాతకం సమాజం ఎటుపోతుంది……. యువకులు ఎందుకు ఇంత కిరాతకంగా మారిపోతున్నారు….. తల్లి తండ్రులు ఊపాధ్యాయులు ఎందుకు వారికి మంచి బుద్ధులు నేర్పలేకపోతున్నారు… చీరాల : కారుకు సైడ్ ఇవ్వలేదని 18 ఏళ్ల యువకుడిని కత్తులతో అతికిరాతకంగా పొడిచి చంపిన సంఘటన మంగళవారం రాత్రి బాపట్ల జిల్లా ఈపూరుపాలెం- ఆదినారాయణపురం మధ్య చోటుచేసుకుంది. మృతుడి స్నేహితుడు మనోజ్ తెలిపిన వివరాల మేరకు … మనోజ్, సయ్యద్ ఆరిఫ్ (18) ఇద్దరూ […]
Read MoreSBI ఛైర్మన్ చల్లా నియామకానికి ఏసీసీ ఆమోదం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. చల్లా స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లాలోని పెద్ద పోతులపాడు గ్రామం. మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ నెల 28న రిటైర్ కానున్న దినేశ్ కుమార్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
Read Moreపాఠశాల విద్యలో ఎపి మోడల్ రూపకల్పనకు చర్యలు చేపట్టండి!
కెజిబివి స్కూళ్లలో పూర్తిగా ప్రతిభ ఆధారంగానే పోస్టుల భర్తీ గురుపూజోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి: పాఠశాల విద్యలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఎపి మోడల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా […]
Read Moreజగన్మోహన్ రెడ్డి నాకు రాజకీయ విరోధి కాదు… ప్రత్యర్థి మాత్రమే
జగన్మోహన్ రెడ్డి తో పోరాటం… పోరాటమే రాజ్యాంగ విలువలకు కట్టుబడే అతడితో మాట్లాడా రాష్ట్రంలో కూటమి గెలుపులో, జగన్మోహన్ రెడ్డి ఓటమిలో రచ్చబండ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిల వ్యవహార శైలి మధ్య అసలు పొంతనే లేదు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలంతా సెల్ఫ్ సెంట్రిక్ అయితే… చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి పబ్లిక్ సెంట్రిక్ గా ఉంటుంది రాష్ట్రంలోని అస్తవ్యస్త పరిస్థితులను […]
Read More