ప్రతి విద్యార్థికి అండగా,తోడుగా చంద్రబాబు

-మెరుగైన విద్యకు తొలి ప్రాధాన్యం -కందుకూరి వీరేశలింగం స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు స్కూల్ కిట్స్ పంపిణీ మెరుగైన విద్యను అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు తొలి ప్రధాన్యం ఇస్తారని నరసరావుపేట ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు అన్నారు.ఈ మేరకు నరసరావుపేట పట్టణం పాతురులోని కందుకూరి వీరేశలింగం పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించినప్పుడే సమాజం […]

Read More

హోంమంత్రిగా అనిత బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు కలసి అభినందనలు తెలిపారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక మహిళ హోం మంత్రిగా బాధ్యతలను స్వీకరించడం ఇదే తొలిసారి.

Read More

డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్ బాధ్యతల స్వీకరణ

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజల చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగానూ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై మంత్రి హోదాలో సంతకాలు చేశారు. బాధ్యతలు చేపట్టిన పవన్‌కు అధికారులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీ తంగెళ్ల […]

Read More

ప్రత్యేక యంత్రాంగంతో సమస్యల పరిష్కారానికి లోకేష్ కృషి

“ప్రజాదర్బార్” కు బారులు తీరుతున్న ప్రజలు! అమరావతి: వైసీపీ పాలనలో అన్ని విధాల నష్టపోయి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలు యువనేత లోకేష్ ప్రారంభించిన “ప్రజాదర్బార్” కు జనం పోటెత్తుతున్నారు. ఉండవల్లి నివాసంలో మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించుకునేందుకు వేకువజాము నుంచే ప్రజలు పెద్దఎత్తున బారులు తీరుతున్నారు. లోకేష్ వద్దకు వెళితే తమకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకంతో […]

Read More

రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ జెస్సీ రాజ్ కు అభినందనలు

రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూజిలాండ్ లో ఇటీవల జరిగిన ప్రపంచ ఓషియానిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన విజయవాడకు చెందిన మాత్రపు జెస్సీరాజ్‌ అత్యున్నత ప్రదర్శన ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రధమ స్థానంలో నిలవడం హర్షణీయం. ఇన్ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన జెస్సీరాజ్ కు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మన విజయవాడకు చెందిన బాలిక […]

Read More

కలకలం రేపుతున్న కందిపప్పు కుంభకోణం… మంత్రి ఆకస్మిక తనిఖీల్లో బైటపడ్డ స్కాం

-పౌరసరఫరాల సరుకుల పంపిణీలో గోల్ మాల్ -కోట్ల కుంభకోణం -నూతన మంత్రి తనిఖీలలో స్కామ్ బట్టబయలు -ఈ కుంభకోణంలో పల్నాడు జిల్లా వినుకొండ దాల్ మిల్లర్ ల లింకులు -వెలుగు చూస్తున్న అనేక అవకతవకలు (వాసిరెడ్డి రవిచంద్ర) ఏపీకి సరఫరా చేసే ప్రజా పంపిణీ కందిపప్పు సరఫరాలో భారీ కుంభకోణాలు జరిగినట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన ప్రకటన చేశారు. ఆయన చేసిన ఆకస్మిక తనిఖీలలో ఈ […]

Read More

శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతమైన తుంగభద్ర నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 6,560 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అదే సమయానికి జలాశయ నీటిమట్టం 812.20 అడుగులుగా ఉంది. నీటి నిలువ సామర్థ్యం 35.6294 టీఎంసీలు ఉంది.

Read More

న్యూయార్క్​తో పోల్చుకునేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలి

– తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో పాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ వృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్నతీరుపై ఈ భేటీలో చర్చించారు. గ్రేటర్ […]

Read More

తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలపాలన్నదే కాంగ్రెస్ కుట్ర

విద్యుత్ కేంద్రం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే చెప్పుతో కొడతా ఎమ్మెల్సీ కోసం కోదండరాం పాకులాట – మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, కేసీఆర్ పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారు.నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని అర్థమైంది. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ తో మీడియా సమావేశం పెట్టించి […]

Read More

పట్టాదారు పాసు పుస్తకాల నిలిపివేత

రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ కోసం గత సర్కారు ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను నిలిపివేయాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 20 లక్షల మంది రైతులకు పుస్తకాలు అందాల్సి ఉండగా ఎన్నికల వల్ల వేలాదిమందికి అవి రాలేదు. మాజీ సీఎం జగన్ ఫోటో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రీ-సర్వే కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది.

Read More