పల్నాడు ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ నరసరావుపేట, మహానాడు: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు జిల్లా ఎస్పీని కోరారు. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కంచి శ్రీనివాసరావును నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో పల్నాడు అంటే అరాచకాలు మాత్రమే గుర్తొచ్చేలా చేశారని […]
Read Moreడివిజన్ పరిధిలో ఎక్స్ ప్రెస్ రైళ్ల పునరుద్ధరణ
గుంటూరు, మహానాడు: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు నుంచి డోన్, నరసాపూర్ మధ్య తిరిగే రైళ్లు ఈ నెల 21, 22 తేదీల్లో యథావిధిగా నడవనున్నాయి. 21వ తేదీన రైలు నం. 17282 నరసాపూర్-గుంటూరు ఎక్స్ ప్రెస్, రైలు నం. 17227 గుంటూరు-డోన్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం కానున్నాయి. అలాగే 22వ తేదీ నుంచి రైలు నం. […]
Read Moreమంత్రి నాదెండ్లను కలిసిన దర్శి జనసేన ఇంఛార్జి
విజయవాడ, మహానాడు: రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ ను దర్శి జనసేన ఇంఛార్జి గరికపాటి వెంకట్ విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చించారు. మంత్రి మనోహర్ సానుకూలంగా మాట్లాడి, త్వరలో దర్శి వస్తానని హామీ ఇచ్చినట్లు వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More‘మహానాడు’ కథనానికి స్పందన
నడికుడి, పిడుగురాళ్లలో ఆ రైళ్లు ఆగుతాయి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడిన యరపతినేని పిడుగురాళ్ల, మహానాడు: రైలు బండ్లను మా ఊళ్లలో ఆపండి మహాప్రభో! అంటూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘మహానాడు’ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. దీనిపై గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి, రైళ్లు ఆయా స్టేషన్లలో నిలిచేలా కృషి చేశారు. వివరాల్లోకి వెళితే… నారాయణద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్స్ లను పల్నాడు […]
Read Moreప్రజల ప్రశాంత జీవనానికి కృషి చేయండి
-ఎస్పీని కలిసిన టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఒంగోలు, మహానాడు: సామాన్య ప్రజానీకానికి ప్రశాంతమైన జీవితం ఉండేవిధంగా లా అండ్ ఆర్డర్ ఉండాలని అందుకు పోలీస్ సిబ్బంది సహకారం అందించాలని దర్శి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఎస్పీని కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ దామోదర్ ను ఒంగోలు ఎస్పీ బంగ్లాలో గురువారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ భేటీ అయ్యారు. ఈ […]
Read Moreఘనంగా ఎస్.వి.రంగారావు వర్ధంతి వేడుకలు
సత్తెనపల్లి, మహానాడు: ఎస్వీ రంగారావు 49వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రం వద్ద ఎస్వీ రంగారావు విగ్రహానికి సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తనయులు గుంటూరు కార్పొరేషన్ మాజీ మేయర్ కన్నా నాగరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ఎస్వీ రంగారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బుడగాల సుబ్బారావు ఆధ్వర్యంలో వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి […]
Read Moreవిజయసాయిరెడ్డిపై జర్నలిస్టుల నిరసన గళం
చిలకలూరిపేట, మహానాడు: రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి పత్రికలను, పత్రిక ఆధిపతులను, విలేకరులను దూషించినందుకు నిరసనగా చిలకలూరిపేటలోని వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన గళం వినిపించారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ, సీపీఐ, సీపీఎం, లోక్ సత్తా, కాంగ్రెస్ పార్టీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు నర్సారావుపేట సెంటర్లో మానవహారంగా ఏర్పడి అరగంటసేపు నిరసన తెలియజేశారు. అనంతరం చిలకలూరిపేట డిప్యూటీ తహసీల్దార్ రవికి నిరసన పత్రాన్ని అందజేశారు.
Read Moreగన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్
మాజీ సీఎం జగన్ బెంగళూరు పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. జగన్ కి గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ను దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో రేపు వినుకొండ వెళ్లి రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.
Read Moreదిక్కుమాలిన, దోపిడీకోరు పాలన వైకాపా పాలన
-1.75 లక్షల ఎకరాలకుపైగా భూ ఆక్రమణలు: ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: అయిదేళ్లు ఏకంగా 1.75 లక్షల ఎకరాలకు పైగా భూములు ఆక్రమించుకున్న దిక్కుమా లిన, దోపిడీకోరు పాలన సాగించిన ఘనత వైకాపా ప్రభుత్వానికే చెల్లుతుందని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. పట్టపగ్గాలు లేకుండా సాగిన వారి అవినీతి, అక్రమాలు ఆధారాలతో బయటపెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారని, వాటితోనైనా […]
Read Moreప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇది
విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోంది. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి వేస్తోంది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్…తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో […]
Read More