హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు జనసంద్రంగా మారింది. దీక్షకు హనుమాన్ మాలధారులు భారీగా తరలివస్తున్నారు. దీక్షాపరుల రాకతో కొండంతా రామ నామస్మరణతో మారుమోగుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు బందోబస్తును పెంచారు. కొండగట్టులో నేటి వరకు హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. దీక్షకు వచ్చే భక్తుల కోసం 300 మంది […]
Read More79 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు..
భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా డజన్ల కొద్దీ మరణించారు. తాజాగా.. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రాల్లో మోహరించిన దాదాపు 20 మంది ఎన్నికల సిబ్బంది హీట్స్ట్రోక్కు గురయ్యారు. మే నెలలో ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టిన ఢిల్లీ.. బుధవారం 79 సంవత్సరాల గరిష్ట స్థాయి 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భారత వాతావరణ శాఖ సూచన […]
Read Moreహిమాచల్ అడవిలో చెలరేగిన మంటలు.. భారీ ఆస్తి నష్టం
హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లోని డింగు అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ సీజన్లో బిలాస్పూర్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అడవులు కాలిపోతున్నాయి. ఒక్క బిలాస్పూర్ జిల్లాలోనే బండ్ల, పర్నాలి, సిహ్రా, లోయర్ భటేడ్, కుడ్డి, బర్మానా, నయనదేవి, భరడి, ఘండిర్తో సహా పలు ప్రాంతాల్లోని అడవులు దగ్ధమయ్యాయి. రాజధాని సిమ్లా అడవులు కూడా దగ్ధమవుతున్నాయి. భారీ అగ్నిప్రమాదం కారణంగా.. ప్రపంచ వారసత్వ కల్కా-సిమ్లా రైల్వే మార్గంలో రైలు రాకపోకలు కూడా […]
Read Moreకౌంటింగ్రోజు వేషాలు వేస్తే తాటతీస్తా…పల్నాడు ఎస్పీ మలికా మాస్ వార్నింగ్
ఓట్ల లెక్కింపు రోజు లా ఆండ్ ఆర్డర్కు ఎవరు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్ హెచ్చరించారు. ఇప్పటికే రావాల్సిన మంచి పేరు వచ్చిందని సటైర్లు వేశారు. పల్నాడు జిల్లాలో పోలింగ్ అనంతరం హింసపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగడంతో పోలీసుశాఖ పై తీవ్ర విమర్శలు తలెత్తాయి. రాజకీయ నేతలకు పోలీసులు తొత్తులుగా మారారని…బహిరంగంగా వార్నింగ్లు ఇస్తున్నా…ఊర్లపైపడిపోయి అరాచకం సృష్టిస్తున్నా పట్టించుకోకపోవడంతో రెచ్చిపోయిన అల్లరిమూకలు ఏకంగా పోలీసుల […]
Read Moreకేసు మూసివేతకు రూ. 3 లక్షల డిమాండ్.. లంచం తీసుకుంటూ దొరికిన కుషాయిగూడ సీఐ, ఎస్సై
నమోదైన కేసును మూసివేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ సీఐ, ఎస్సై, మరో వ్యక్తి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. హైదరాబాద్లోని కుషాయిగూడలో జరిగిందీ ఘటన. ఏసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడలోని వాసవి శివనగర్ కాలనీలో స్థలం విషయంలో ఓ మహిళకు, స్థానికంగా నివసించే సింగిరెడ్డి భరత్రెడ్డికి మధ్య వివాదం నడుస్తోంది. మహిళ ఫిర్యాదుతో ఏప్రిల్లో భరత్రెడ్డిపై […]
Read Moreభారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధర..!
లోక్సభ ఎన్నికల చివరి దశ రోజున ఎల్పీజీ వినియోగదారులకు మంచి ఊరట లభించింది. ఎల్పీజీ సిలిండర్ల ధరలను ప్రభుత్వ చమురు, గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా మూడోసారి తగ్గించాయి. ఈ విధంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎల్పీజీ సిలిండర్ల ధర మూడు రెట్లు తగ్గడం విశేషం. లోక్సభ ఎన్నికల చివరి దశ రోజున ఎల్పీజీ వినియోగదారులకు మంచి ఊరట లభించింది. ఎల్పీజీ సిలిండర్ల ధరలను ప్రభుత్వ చమురు, గ్యాస్ […]
Read Moreహైదరాబాద్ మహానగరంలో ఉదయం 10.30 నుంచి విద్యుత్ సరఫరా బంద్..
మరమ్మతుల కారణంగా గ్రీన్ ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ బానోతు చరణ్ సింగ్ తెలిపారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 11 కేవీ విద్యుత్ టవర్స్, స్వరాజ్ నగర్ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 12గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ గ్రేహౌండ్స్, శ్రీరామ్ నగర్ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 2 గంట ల […]
Read Moreమనమే’ స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ వున్న బ్యూటీఫుల్ ఎంటర్ టైనర్: కృతి శెట్టి
డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ […]
Read Moreనేటితో ముగియనున్న ఎన్నికలు..
దేశంలో ఏడు విడతలుగా జరుగుతున్నసార్వత్రిక ఎన్నికలకు నేటితో తెరపడనుంది. నేడు చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఎన్నిలు జరగనున్నాయి. మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్లో 13, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 9, ఒడిశాలో 6, ఝార్ఖండ్లో 3, పంజాబ్లో 13, హిమాచల్ప్రదేశ్లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మీర్జాపూర్ […]
Read Moreజగన్ చిత్తుగా ఓడిపోతున్నారు : సీపీఐ నారాయణ
ఈసారి జగన్మోహన్రెడ్డి దారుణంగా ఓడిపోతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు చేయని పాపాలంటూ లేవని, కాబట్టి ప్రజలందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని తెలిపారు. నిన్న తిరుపతిలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోతున్నారని తెలిసి కూడా వైజాగ్లో ప్రమాణ స్వీకారం ఉంటుందని ఏర్పాట్లు చేస్తుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాజకీయంగా […]
Read More