పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి సింధు నిష్క్రమణ

పారిస్‌, మహానాడు: పారిస్‌ ఒలింపిక్స్‌లో ఏదొక పతకం సాధిస్తుందని పి.వి సింధుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి హ్యాట్రిక్‌ కొడుతుందని అంతా ఊహించారు. కానీ సింధు ఓడిరది. పోరాడి ఓడిరది. క్వార్టర్స్‌ చేరు కుండానే ఒలింపిక్స్‌ నుంచి ఇంటి బాటపట్టింది.  బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌ లో ఆమె 19-21, 14-21తో చైనా క్రీడాకారిణి హే బిన్‌ జియావో చేతిలో ఘోరంగా ఓడిరది. తొలిగేమ్‌ ను గెలిచే ఛాన్స్‌ సింధు […]

Read More

ఎంఐజి లేఔట్‌ను పరిశీలించిన మంత్రి మండిపల్లి

రాయచోటి, మహానాడు: మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్మిస్తున్న ఎంఐజి లేఅవుట్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఎంఐజి లేఔట్‌ ను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మందడిపల్లి […]

Read More

నీట్‌ పరీక్షపై సుప్రీంకోర్టు తుది తీర్పు

న్యూఢిల్లీ,మహానాడు: నీట్‌ -యుజీ పరీక్ష పవిత్రత దెబ్బ తినేలా వ్యవస్థాగత ఉల్లంఘన జరగనందున పరీక్షను రద్దు చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది నిర్లక్ష్యం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కేంద్రానికి, ఎన్‌టీఏకి మొట్టికాయ లేసింది. నీట్‌లో సంస్కరణలను పరిగణన లోకి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పరిధిని పెంచుతున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి. పార్థివాలా, జస్టిస్‌ […]

Read More

పార్లమెంట్‌ లో వరదనీరు

న్యూఢిల్లీ, మహానాడు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంట్‌ భవనం వరదల్లో చిక్కుకుంది. కొద్దిపాటి వర్షానికే భవనంలో పలికి వర్షపు నీరు చేరి ఇబ్బంది కరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. భవనం పైకప్పు నుంచి కూడా నీరు లీకైన వీడియోను కాంగ్రెస్‌ నేత మాణిక్కం ఠాగూర్‌ షేర్‌ చేశారు. రూ.970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ […]

Read More

జాబ్ క్యాలెండర్ గురించి ముందే ప్రకటించాం

అమలు చేస్తున్నాం గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్, పరీక్షలు వాయిదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన జాబ్ క్యాలెండర్ పై శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నెరవేర్చేందుకు.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముందే చెప్పాం.. ఆ విధంగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు, రద్దు కావడం, వాయిదా […]

Read More

రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్

– నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంపుతో పాటు ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలి – సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలి – విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్ర రైతాంగానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆయా ఫీడర్ల సామర్ధ్యాన్ని […]

Read More

అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి

• అవయవదానంతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపవచ్చు • అవయవ దానంతో మరొక వ్యక్తికి పునః జన్మనివ్వచ్చు • ఏటా ఐదు లక్షల మంది అవయవాలు చెడిపోవడం వల్ల మరణిస్తున్నారు • జాతీయ స్థాయిలో సైతం అవయవదానం రిజిస్ట్రేషన్లు ఉన్నాయి • అవయవదానం చేసిన వారి అంత్యక్రియలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొని వీరవందనం చేసేలా చర్యలు. • అవయవదానం చేసిన వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందేలా చర్యలు […]

Read More

ఎన్నో ఏళ్ల పోరాటాలతో ఎస్సీ వర్గీకరణ కల సాకారం

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మహానాడు, నందిగామ టౌన్‌: తెలుగుదేశం ప్రభుత్వం అన్ని తరగతులకూ సమన్యాయం జరగాలని 1996లో జస్టిస్‌ రామచంద్రరాజు కమిషన్‌ వేసి దేశంలోనే మొదటిసారి ఎస్‌సి వర్గీకరణపై ముందడగు వేసిందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. సామాజిక న్యాయం గెలవాలనేది టిడిపి సిద్ధాంతమని, అత్యంత నిరుపేదలకు ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 30 ఏళ్ల కిందటే చంద్రబాబు సామాజిక న్యాయాన్ని అమలు చేశారని లోకేశ్‌ వెల్లడిరచారు. […]

Read More

విద్యార్థుల ప్రతిభకు తోడ్పాటు

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మహానాడు, చందర్లపాడు: చందర్లపాడు మండలం కోనయపాలెం గ్రామంలో పదవ తరగతిలో 400కు పైగా మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు శ్రీ సాయి ఆరాధన క్షేత్రం షిరిడి, విజయవాడ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతులు మీదుగా స్కాలర్‌ షిప్పులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న ఆశలను సాధించే దిశగా తల్లిదండ్రులకు మంచి పేరును తెచ్చే విధంగా ప్రతి ఒక్క […]

Read More

ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ను ఆకస్మిక తనిఖీ

మహానాడు, గుడివాడ: గుడివాడ ఏరియా వైద్యశాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో సమస్యలు తలెత్తితే… ప్రజా వేదికలో ఫిర్యాదు చేయాలంటూ రోగులు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ముందుగా హాస్పిటల్‌ ఓపి రిజిస్టర్‌ తనిఖీ చేసిన ఎమ్మెల్యే సక్రమంగా మందులు అందుతున్నాయా లేదా అంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో […]

Read More