తిరుపతి: బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వరప్రసాద్ కంటతడి పెట్టారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. చాలాతక్కువ మెజారిటీతో ఓడిపోయా. గతంలో జగన్, విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డిలకు సలహాలు ఇచ్చినా పెడచెవిన పెట్టారు. గడిచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యం లేదు. అరాచక పాలన నుంచి కాపాడుకోవడానికి బీజేపీలో చేరినట్లు వ్యాఖ్యానించారు. ఏ సామాజిక వర్గానికి మోదీ, బీజేపీ అన్యాయం చేయలేదని, ఏపీకి ప్రత్యేక హోదాను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.
Read Moreహైకోర్టులో పిన్నెలికి తాత్కాలిక ఊరట
మధ్యంత బెయిల్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు ఇరుపక్షాల న్యాయవాదుల అనుమతితో కోర్టు నిర్ణయం అమరావతి: ఎన్నికల సందర్భంగా అరాచకాలు సృష్టించిన కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై నమోదైన నాలుగు కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. గురువారం బెయిల్ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ ప్రాథమిక విచారణ జరిపింది. అప్పటికే […]
Read Moreరాష్ట్రాన్ని పునర్నిర్మాణమే తొలి ప్రాధాన్యం
ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయి టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ ఢిల్లీ: రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయని టీడీపీ నేత కనక మేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఎన్డీఏ పక్షాల రెండో సమావేశం జరిగిందని, అనంతరం ఎంపీలతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా మోదీ ఈ నెల 9న ప్రమాణ స్వీకా రం చేస్తారని […]
Read Moreపాఠశాలల్లో ఫీజుల ‘మోత’
40 నుంచి 50 శాతం వరకు భారం కొన్నింటిలో 25 శాతం వరకు పెంపు నియంత్రణపై ప్రభుత్వ చర్యలు శూన్యం హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రు లకు ఏటేటా భారంగా మారుతున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలు ముఖ్యంగా కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతు న్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెంచేశాయి. కొన్ని కార్పొరేట్ […]
Read Moreరాజధాని అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తాం
డబుల్ ఇంజిన్ సర్కార్తో రూపురేఖలు మారుస్తాం అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని, రోడ్లన్నీ అస్తవ్యస్తమై అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్తో రూపురేఖ లు మారుస్తామని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. గత పది సంవత్సరాలుగా దేశాన్ని మోదీ అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. అందుకే ప్రజలందరూ మోదీని మూడోసారి ఎన్నుకున్నారని తెలిపారు. ఏపీలో మాత్రం […]
Read Moreఅనిల్ కుటుంబానికి కొడాలి నాని ఆర్థిక సాయం
గుడివాడ: నియోజవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ఓటమిని తట్టుకో లేక సైదేపూడి గ్రామానికి చెందిన పిట్ట అనిల్ అనే వాలంటీర్ ఆత్మహత్య చేసు కున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకుని అనిల్ కుటుంబ సభ్యులను కొడాలి నాని పరామర్శించారు. అంతేకాకుండా రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును కుటుంబసభ్యులకు అందజేశారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి అండ గా ఉంటానని భరోసా ఇచ్చారు.
Read Moreహరిత తారామతి బారదారి రిసార్ట్స్ అధ్వానం
నిర్వహణ లోపాలపై పర్యాటక మంత్రి జూపల్లి ఆగ్రహం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశం భవిష్యత్లో గోల్కొండ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు వెల్లడి హైదరాబాద్: హరిత తారామతి బారదారి రిసార్ట్స్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిసార్ట్స్ అంతా కలియదిరిగారు. హరిత హోటల్ రూమ్స్, హరిత రెస్టారెంట్, పుష్పాంజలి ఆంఫి థియేటర్, ఆడిటోరియం, స్విమ్మింగ్ ఫూల్, టాయిలెట్స్ను పరిశీలిం చారు. రిసార్ట్స్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం […]
Read Moreఎంపీల్లో 93 శాతం మంది కోటీశ్వరులే
తొలి రెండు స్థానాల్లో తెలుగు వాళ్లే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ వెల్లడి ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో 93 శాతం మంది కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్’ (ఏడీఆర్) తెలిపింది. గత ఎంపీల్లో 475 మంది మిలియనీర్లు ఉండగా ఈసారి 504కు పెరిగిందని వెల్లడిరచింది. ధనిక ఎంపీల్లో గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,705 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి […]
Read Moreఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్
కొత్త ప్రభుత్వం ఏర్పాటు ముందు కీలక మార్పులు బదిలీపై వెళ్లిన జవహర్రెడ్డి..ఆ వెంటనే ఉత్తర్వులు సీఎంవో టీమ్పైనా కొనసాగుతున్న కసరత్తు అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్ నియమితుడయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్కు చెందిన ఆయన గతంలో చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శిగా పనిచేస్తున్నారు. […]
Read Moreహాస్టల్కు రెడ్డి పేరు..రెచ్చిపోయిన జనసైనికులు
కర్రలు, రాళ్లతో దాడి చేసి అద్దాలు, కుండీల ధ్వంసం యజమానితో కాళ్లు పట్టించుకున్న వైనం గుంటూరు : హాస్టల్ నేమ్ బోర్డుపై రెడ్డి అని ఉన్నందుకు హాస్టల్ యజమానిపై జనసైనికులు దాడి చేసి కాళ్లు పట్టించుకున్న ఘటన గుంటూరు లక్ష్మీపురంలో చోటుచేసుకుంది. హాస్టల్ పేరులో రెడ్డి అని ఉన్నందుకు యజమానిని కొట్టిన జనసైనికులు హాస్టల్ మీద కర్రలు, రాళ్లతో దాడి చేశారు. హాస్టల్ యజమాని చేత బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి […]
Read More