నిడుముక్కలలో పోలీసు బలగాలతో కవాతు

ఇరువర్గాలతో డీఎస్పీ సమావేశం ప్రశాంతతకు సహకరించాలని సూచన శాంతి కమిటీ ఏర్పాటుకు నిర్ణయం గుంటూరు, మహానాడు : గుంటూరు జిల్లా తాడికొండ పోలీసుస్టేషన్‌ పరిధిలోని నిడుముక్కల గ్రామంలో ఆదివారం పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. తుళ్లూరు డీఎస్పీ అశోక్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. గ్రామంలో రెండువర్గాలతో సమావేశం నిర్వహించారు. తాత్కాలిక ఆవేశాలకు గురికాకుండా శాంతియుతంగా వ్యవహ రించాలని సూచించారు. గ్రామంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడేందుకు సహక రించాలని కోరారు. […]

Read More

ఎయిర్‌ ఇండియా విమానం ఇంజన్‌లో మంటలు

హైదరాబాద్‌, మహానాడు : బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. దాంతో బెంగళూరు కెంపెగౌడ విమానాశ్ర యంలో అత్యవసర ల్యాండిరగ్‌ చేసి మంటలను ఆర్పివేశారు. మొత్తం 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా తరలించారు.

Read More

అవినీతిలో ఆరితేరిన రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మళ్లీ వసూళ్ల రాజ్యం హామీలపై కార్యాచరణ లేదు బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ ధ్వజం మిర్యాలగూడ: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కొలువుతీరి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ కూడా లేదని మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌ విమర్శించారు. ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేమో అన్న భయంతో దేవుళ్ల మీద ప్రమాణం చేసి రెండు లక్షల […]

Read More

తమిళనాడులో వర్షాలు..రెడ్‌ అలర్ట్‌ జారీ

తమిళనాడు, మహానాడు : తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం మధ్య ఆ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కన్యాకుమారి, టెన్‌ కాశీ, కోయంబత్తూరు, తంజావూర్‌, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ధర్మపురి, తిరుపూర్‌, నీలగిరి జిల్లాల్లో ఇవాళ, రేపు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ […]

Read More

సింగపూర్‌లో భారీగా కరోనా కేసులు

సింగపూర్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి 11 వరకు 25,900 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం వేవ్‌ ప్రారంభ దశలో ఉందని.. రానున్న 2-4 వారాల్లో భారీగా కేసులు నమోదవుతాయని అంచనా వేస్తోంది. రోజుకు 250 మంది ఆస్పత్రుల్లో చేరుతుండగా.. 60 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు అదనపు డోస్‌ టీకా తీసుకోవాలని […]

Read More

రాష్ట్రంలో అలర్లకు వైసీపీ నేతలే కారణం

అధికారుల వ్యవహార శైలి అనుమానంగా ఉంది ఎన్నికల సంఘానికి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తాం బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం విజయవాడ, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌ శాతం చూస్తే ప్రజల స్పందన అర్థమవుతోందని, ఎన్నికల సంఘం తీసుకున్న అనేక చర్యలతో ప్రజలు ఓట్లు వేసేందుకు తరలివచ్చారన్నారు. ఐప్యాక్‌ […]

Read More

సుందరయ్య జీవితం యువతకు ఆదర్శప్రాయం

కార్పొరేట్లకు దాసోహం అంటున్న పార్టీలు నేతలే కాదు.. ప్రభుత్వ విధానాలు మారాలి సమాజ మార్పుకు కమ్యూనిస్టులు పోరు ఆగదు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు విజయవాడ, మహానాడు : కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని సీపీఎం, సీఐటీ యూ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు పాల్గొని నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య […]

Read More

జూనియర్‌ మోడల్‌ విజేతగా చిహ్నిక

గాజువాక బాలిక ఘనత అంతర్జాతీయ పోటీలకు ఎంపిక అమరావతి : తెలుగమ్మాయి చిహ్నిక జూనియర్‌ మోడల్‌ ఇంటర్నేషనల్‌ విజేతగా నిలిచింది. కేరళలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ తరపున పోటీలో పాల్గొ న్న గాజువాకకు చెందిన చిహ్నిక ఈ ఘనత సాధించింది. ప్రిన్సెస్‌ ఆఫ్‌ ఆంధ్రప్ర దేశ్‌గా నిలిచింది. త్వరలో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైం ది. చిహ్నిక గతంలోనూ అనేక పోటీల్లో బహుమతుల కైవసం చేసుకుంది.

Read More

అమెరికాలో తుఫాన్‌ బీభత్సం..నలుగురి మృతి

అమెరికాలోని నాలుగో అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌ పెను తుఫాన్‌తో వణికి పోయింది. ఈ తుఫాన్‌ కారణంగా నలుగురు మృతిచెందారు. 8 లక్షల గృహా లు, వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి. వేలాది భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. వరద నీటితో పలు వీధులు జలమయమయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. ముందుజాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలను మూసివేశారు. రెండు విమానాశ్రయాల్లో విమానాల రాక పోకలకు అంతరా యం ఏర్పడిరది.

Read More

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

31 నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం 22న బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తా, రాయలసీమలో వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్‌ జారీ అమరావతి :  నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకాయి. ఈ నెల 31 నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని, జూన్‌ మొదటి వారంలో రాయల సీమలోకి రావచ్చని వాతావరణ శాఖ వెల్లడిరచింది. రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 24వ తేదీ నాటికి […]

Read More