సత్తెనపల్లిలో అంబటిపై కన్నా ఘన విజయం

అమరావతి: సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 20వ రౌండ్‌ ముగిసే సరికి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 27196 ఓట్లతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంబటి రాంబాబు పరాజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read More

చంద్రబాబును కలిసిన సిద్దార్థ్‌ నాథ్‌ సింగ్‌

ఉండవల్లి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఉండవల్లిలోని నివాసంలో బీజేపీ ఏపీ వ్యవహరాల ఇన్‌చార్జ్‌ సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో శుభాకాంక్షలు తెలిపారు.

Read More

చంద్రబాబు నివాసంలో నారా, నందమూరి సంబరాలు

ఉండవల్లి: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ఉండవల్లిలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు మిన్నంటాయి. నారా, నందమూరి కుటుంబసభ్యులు, బంధువులు కేక్‌ కట్‌ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మనవడు దేవాన్ష్‌ కేక్‌ కట్‌ చేసి చంద్ర బాబుకు, బంధువులకు కేక్‌ తినిపించారు.

Read More

వైసీపీ ప్రభుత్వాన్ని ఓటర్లు తిరస్కరించారు

-అహంకారానికి, అరాచకానికి చెంపపెట్టు -జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరు: ఐదేళ్ల కాలంలో అహంకారపూరితంగా, అరాచకంగా, అవినీతిమ యంగా, అభివృద్ధికి ఆస్కారం లేకుండా చేసిన వైకాపా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు తిరస్కరించారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భావ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వకుండా 13.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్‌ ను అప్పుల ఊబిలో ఉంచటంపై […]

Read More

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి నజీర్‌ అహ్మద్‌

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి నజీర్‌ అహ్మద్‌కు ఆచార్య నాగార్జున విశ్వావిద్యాలయం కౌంటింగ్‌ సెంటర్‌లో డిక్లరేషన్‌ అందజేస్తున్న నగర కమిషనర్‌, గుంటూరు ఈస్ట్‌ రిటర్నింగ్‌ అధికారి చేకూరి కీర్తి.

Read More

39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో పసుపు జెండా రెపరెపలు

– నారా లోకేష్‌ నాయకత్వంలో టీడీపీ జయకేతనం – 1985 తర్వాత ఇన్నేళ్లకు విజయంతో రికార్డ్‌ – ఓడిన చోటే పోరాడి గెలిచిన యువనేత మంగళగిరి: ఎన్నాళ్లకు..ఎన్నేళ్లకు మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపు పిలుపు వినపడి… పసుపుజెండా విజయగర్వంతో ఎగిరింది. 39 ఏళ్ల తర్వాత మళ్లీ మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప లాడిరది. మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యువనేత నారా లోకేష్‌ భారీ […]

Read More

ఒక విజయం.. మరో విపత్తు!

( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రపంచ సైకిల్ దినోత్సవం మరుసటిరోజు ఆంధ్రా ప్రజలు సుమానీలా సైకిల్ ఎక్కారు. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లు ఇచ్చిన ఆంధ్రా ఓటరు, ఈసారి ఆ ఒక్క పార్టీకే 137 స్థానాలు పువ్వుల్లో పెట్టి అప్పగించడం రికార్డే. ప్రజాగ్రహం-ప్రజాభిమానం ఒక్కోసారి అంత వింతగా-ఊహించని విధంగా ఉంటుంది. దానికే పొంగిపోయి తలకెక్కిన అహంకారంతో నిర్ణయాలు తీసుకుంటే, వైసీపీలా పతనం తప్పదు. ఎన్డీయేతో జతకట్టి విజయభేరి మ్రోగించిన టీడీపీకి […]

Read More

పరిపూర్ణానందకు పరాభవం

– స్వామీ.. నదికి పోలేదా? – అడ్డం తిరిగిన సాములోరి జోస్యం – వైసీపీకి 123 సీట్లు వస్తాయన్న పరిపూర్ణ -23 కూడా దక్కని విషాద ఫలితం – సోషల్‌మీడియాలో స్వామికి వెక్కిరింపుల పర్వం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎన్నికల ఫలితాల రోజున కాకినాడ శ్రీపీఠాథిపతి పరిపూర్ణానందస్వామి ముఖం ఎక్కడా కనిపించడం లేదు. మాట ఎక్కడా వినిపించడం లేదు. పాపం ఆయన ముఖం చెల్లక, ముఖం చాటేసినట్లున్నారని నెటిజన్లు తెగ […]

Read More

బీజేపీకి 2, జనసేనకు 3 మంత్రి పదవులు?

– బాబు క్యాబినెట్‌లో జనసేన-బీజేపీ? – కేంద్ర క్యాబినెట్‌లో టీడీపీ? – ఏపీ నుంచి పురందేశ్వరి లేదా సీఎం రమేష్? తాజా ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి అధికారపగ్గాలు అందుకోనుంది. ఈనెల 9న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోకి కూటమి పార్టీలను భాగస్వాములను చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు 20 స్థానాలు సాధించిన జనసేనకు మూడు, 7 స్థానాలు గెలిచిన బీజేపీకి రెండు మంత్రి […]

Read More

9న బాబు ప్రమాణ స్వీకారం

– అమరావతి వేదికగా – నాలుగోసారి సీఎం కానున్న చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో విజయభేరి మ్రోగించిన టీడీపీ ఏపీ అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. సొంతగానే సంపూర్ణ మెజారిటీ సాధించిన టీడీపీ ,రెండోసారి అధికారంలోకి రానుంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 9న అమరావతిలో ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Read More