ఔరా..ఏమి ఎగ్జిట్‌ పోల్స్‌!

-మోదీ విలాసం..మోదీ విలాపం -జగనన్న మోదం…జగనన్న ఖేదం -ఎందుకు డౌటనుమానం? -అధినేతలందరికీ తెలుసు -అందుకే ఆందోళన అమరావతి: ఎగ్జిట్‌ పోల్‌…ఎగ్జిట్‌ పోల్‌…ఎగ్జిట్‌ పోల్‌…ఉదయం లేచించి మొదలు ఒకటే గోల. మూడురోజుల్లో ఎవరి తలరాత ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఈ ఎగ్జిట్‌ పోల్‌ పేరుతో మీడియా సంస్థలు పూనకాలతో చెలరేగిపోయేందుకు బస్కీలు మీద బస్కీలు తీస్తున్నాయి. ఇప్పటికే పోస్ట్‌ పోల్‌ పేరుతో యూటూబర్స్‌ లక్షలకు లక్షల వ్యూస్‌ గొల్లగొట్టేశారు. ఏపీలో […]

Read More

ఎన్నికలపై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఏడో విడత పోలింగ్‌ జరుగుతున్న వేళ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికలు శాంతియుతంగా జరిగినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రజల నిర్ణయాన్ని గౌరవించినందుకు వారు కూడా సంతోషంగా ఉంటారని నేను భావిస్తున్నాను. రాజకీయ పార్టీలు, నాయకులు, వారి అవకాశాలపై నేను వ్యాఖ్యానించదలచుకోలేదు’’ అని పేర్కొన్నారు.

Read More

ఏపీలో మద్యంషాపులు బంద్‌.. ఎప్పుడంటే…

-కౌంటింగ్‌ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం -భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ వెల్లడి అమరావతి: ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 3 సాయంత్రం నుంచి 5వ తేదీ ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు మూసివేయాలని నిర్ణయించింది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యగా మద్యం దుకాణాలు బంద్‌ చేయాలని డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. […]

Read More

ఓటేసిన హర్భజన్‌, నటుడు రవికిషన్‌

పంజాబ్‌: చివరిదశ పోలింగ్‌ సందర్భంగా జలంధర్‌లో మాజీ క్రికెటర్‌, ఆప్‌ రాజ్యసభ ఎంపీ హర్భజన్‌సింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఈ రోజు మనందరికీ చాలా ముఖ్యమైన రోజు.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసి మీ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోం డి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే యూపీలోని గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి, సినీనటుడు రవికిషన్‌ ఓటువేశారు. దేశాన్ని ‘విశ్వ […]

Read More

గన్నవరం ఎయిర్‌పోర్టులో జగన్‌కు ఘనస్వాగతం

గన్నవరం: లండన్‌ నుంచి రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి కుటుం బానికి గన్నవరం ఎయిర్‌ పోర్టులో ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎంపీ లు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్‌, మంత్రులు జోగి రమేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారా యణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనీల్‌కుమార్‌, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, టి.జె.సుధాకర్‌బాబు, కోన రఘుపతి, ముదునూరి ప్రసాదరాజు, శిల్పా చక్రపాణిరెడ్డి, […]

Read More

సీఐ నారాయణస్వామిపై ఎన్నికల కమిషన్‌ వేటు

హైకోర్టు ఆదేశాలతో ఈసీ చర్యలు ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం అమరావతి: హైకోర్టు ఆదేశాలతో కారంపూడి సీఐ నారాయణస్వామిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై సిట్‌ తో విచారణకు ఆదేశించింది. ఇతర పోలీసు అధికారులపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాక్ష్యాలు సమర్పిస్తే విచారణకు సిద్ధమని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. గుంటూరు రేంజ్‌ ఐజీ త్రిపాఠి, పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్‌, కారంపూడి సీఐ […]

Read More

సుప్రీంకోర్టుకు పిన్నెల్లి బాధితుడు నంబూరి

బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ ఈవీఎం ధ్వంసంలో పేరు చేర్చలేదని వెల్లడి మాచర్ల: పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆయనకు హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపును, బెయిల్‌ను రద్దు చేయాలని నంబూరి శేషగిరిరావు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని, కౌంటింగ్‌ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై మరో పిటిషన్‌ […]

Read More

అమరవీరుల స్థూపం చుట్టూ ఇనుప కంచె!

హైదరాబాద్‌: తెలంగాణ అమరవీరుల స్థూపం ఉన్న గన్‌పార్క్‌ చుట్టూ ఇనుప కంచెలు దర్శనమిస్తున్నాయి. మాది ప్రజాపాలన, ఇనుప కంచెలు లేని పాలన అన్నారు.. ఇప్పుడు ఇష్టారాజ్యంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు.. చెప్పేదొ కటి, చేసేదొకటి…ఇదే స్కాంగ్రెస్‌ నైజమని బీఆర్‌ఎస్‌ గోదావరిఖని నియోజకవర్గం రామగుండానికి చెందిన పార్టీ నేత షఫీ ఖాన్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది ఇనుప కంచెల కాంగ్రెస్‌ పాలన అంటూ మండిపడ్డారు.

Read More

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర

జగ్గయ్యపేట వినాయక గుడి నుంచి ప్రారంభం ప్రారంభించిన శ్రీరాం చిన్నబాబు విజయవాడ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని శనివారం ఉదయం పెనుగొండ సతీష్‌, మహం కాళి ప్రకాష్‌ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట 16వ వార్డు చెరువు బజారుకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుమలగిరి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టారు. జగ్గయ్యపేట పట్టణంలో బంగారు కొట్ల సెంటర్‌ దగ్గర వినాయకుడి గుడి నుంచి ఈ పాదయాత్ర […]

Read More

హనుమాన్‌ ఆశీస్సులతో చల్లగా ఉండాలి

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తి మార్గం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‌ ఉయ్యూరు: రామభక్త హనుమంతుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‌ ఆకాంక్షించారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా ఉయ్యూరు 16వ వార్డులోని హనుమాన్‌ నగర్‌ లో ఆంజనేయ స్వామి గుడిలో శనివారం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమాన్‌ నగర్‌లో ప్రతి హనుమాన్‌ […]

Read More