వచ్చేది కూటమి ప్రభుత్వం..ఉక్కుపాదమే గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని తెనాలి, మహానాడు : రౌడీయిజాలు, గల్లీలో గంజాయి విక్రయాలు ఇకనైనా ఆపేయాలి. వచ్చేది టీడీపీ ప్రభుత్వం.. అన్యాయం, అరాచకాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క ఇకనుంచి మరో లెక్క. అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని ఐతానగర్ నుంచి గురువారం తన పర్యటన ప్రారంభించారు. తెనాలి […]
Read Moreనేడు ఏపీలో శాంతిభద్రతలపై చర్చాగోష్టి
విజయవాడ, మహానాడు : రాష్ట్రంలో 2014-2024 మధ్య శాంతిభద్రతలు అన్న అంశంపై శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడ మొఘలరాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో చర్చాగోష్టి జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్, హైకోర్టు న్యాయవాది పడిరి రవితేజ, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి, ఏపీ టుమారో అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి, మాలమహానాడు అధ్యక్షుడు మల్లెల వెంకటరావు, […]
Read Moreరాజమండ్రి నెక్స్ట్ లెవెల్ అంటే ఇదేనా?
– అరగంట వర్షానికే నగరం జలమయం ` కమీషన్ల కోసం నాశనం చేశారు – భరత్పై కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజం రాజమహేంద్రవరం: కమీషన్ల కోసం మార్గాని భరత్ రామ్ రాజమండ్రి నగరాన్ని నాశనం చేశారని సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మండిపడ్డారు. తిలక్ రోడ్డులోని తన ఎన్నికల ప్రచార శిబిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భరత్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. […]
Read Moreఓట్ల కోసమే బీజేపీ నేతల మత చిచ్చు
విశ్వనగరంపై విషం చిమ్ముతున్నారు ఎన్నికల అధికారులు కేసులు పెట్టాలి సరూర్నగర్ జనజాతర సభలో సీఎం రేవంత్రెడ్డి సరూర్నగర్, మహానాడు : ఓట్ల కోసమే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచా రంలో భాగంగా గురువారం సరూర్ నగర్ జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. ఈ లోక్సభ ఎన్నిక లు దేశ ప్రజలకు జీవన్మరణ సమస్య. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో […]
Read Moreఅక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం
వాస్తవంగా ఇప్పుడు అక్షయ తృతీయ నాడు బంగారం వెండి లాంటి విలువైన వస్తువులు కొనడం రివాజుగా మారింది. కానీ అప్పోసొప్పో చేసి ఈ పండుగ జరుపుకోకూడదు. గుర్తుంచుకోండి. ఈ రోజు అప్పు చేస్తే అది అక్షయమవుతుంది. వాస్తవంగా ఈ అక్షయ తృతీయ నాడు విరివిగా దాన ధర్మ కార్యములు చేసేవారు. ఎందుకంటే ఈ రోజు చేసే జప , తపములు , దాన ధర్మములు అక్షయమవుతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. మత్స్య […]
Read Moreఅక్షయ తృతీయ రోజునే చందనోత్సవం
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు , విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం తెలిసిందే. ఆ […]
Read Moreభూములు గుంజిన వెంకట్రామిరెడ్డికి బుద్ధి చెప్పండి
వందల కోట్లు ఇవ్వబట్టే ఆయనకు సీటు తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్టే కేసీఆర్ బస్సు యాత్ర ఓట్ల కోసం బీజేపీ దేవుళ్ల రాజకీయం ఇందిర హయాంలోనే మెదక్ పారిశ్రామికాభివృద్ధి పదేళ్ల బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో మగ్గిపోయింది నర్సాపూర్ జనజాతర సభలో రేవంత్రెడ్డి నర్సాపూర్, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జరిగిన నర్సాపూర్ జనజాతర బహిరంగ సభలో సీఎం రేవం త్రెడ్డి ప్రసంగించారు. మండుటెండల్లో, మంచు కొండల్లో పాదయాత్ర చేసిన నాయకుడు […]
Read Moreపోలింగ్ ముగిసిన సాయంత్రానికే జగన్ లండన్ పారిపోతాడు
-అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రౌడీ మూకలు బరితెగిస్తున్నారు -జగన్ అండతో రెచ్చిపోతున్న వైసీపీ గూండాల పరిస్ధితి ఏంటో ఆలోచించుకోండి – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రౌడీ మూకలు బరితెగిస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈనాడు కంట్రిబ్యూటర్ రమేశ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అధికారం నుంచి దిగిపోయే వరకు వైసీపీ […]
Read Moreకోట్ల ఇమేజ్ ముందు బుగ్గన వెలవెల
– బుగ్గనపై సర్వత్రా వ్యతిరేకత – అప్పుల మంత్రి పేరుతో అప్రతిష్ఠ – డోన్లో కన్నా ఢిల్లీలోనే ఎక్కువ మకాం – సర్వత్రా ‘పానీ’పట్టు యుద్ధాలే – మంచినీటి సమస్యతో ‘ఫ్యాను’కు కష్టకాలం – బుగ్గనను విడిచి కోట్ల వెంట నడుస్తున్న అనుచరులు – కోట్ల ఇమేజ్ ముందు బుగ్గన వెలవెల కర్నూలు: కేంద్రమాజీ మంత్రి, డోన్ టీడీపీ అభ్యర్ధి కోట్ల సూర్యప్రకాష్రెడ్డికి ఆయన నిజాయితీ, నిరాడంబరతే గెలుపు సోపానమవుతోంది. […]
Read Moreసీఎం రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
ఎన్నికల ప్రధానాధికారికి విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు హైదరాబాద్, మహానాడు : ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి…శ్రీరామచంద్రుడు, సీతమ్మపై చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ తప్పుపడుతోంది. అక్షింతలు అయోధ్య నుంచి వచ్చినవి కాదని, అవి బియ్యంతో తయారుచేసి పంచారని ఆరోపించడాన్ని వ్యతిరేకించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన రేవం త్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజుకు వీహెచ్పీ నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ శ్రీరామ్ […]
Read More