ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచనలు

విశాఖపట్నం: కోస్తాంధ్ర, రాయలసీమలను చుట్టుముట్టిన వేడి తరంగాల ప్రస్తుత దశకు ముగింపు పలికి మే 7 నుంచి మే 9 వరకు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అమ రావతి ఐఎండీ నివేదిక పేర్కొంది. ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

Read More

థ్యాంక్స్‌ మై ఫ్రెండ్‌ చంద్రబాబు: ప్రధాని మోదీ

అమరావతి: తనకు స్వాగతం చెబుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. థ్యాంక్స్‌ మై ఫ్రెండ్‌ చంద్రబాబు గారూ.. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుని రాజమండ్రికి వెళుతున్నా. సాయంత్రం అనకాపల్లి ర్యాలీలో పాల్గొంటా. ఏపీ మొత్తం ఎన్డీయేతోనే ఉంది అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి జోరుపై మరో ట్వీట్‌ ప్రధాని మోదీ ఏపీ రాజకీయాలపై మరో ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో […]

Read More

భారత్‌-నేపాల్‌ సరిహద్దు మూసివేత

బిహార్‌: లోక్‌సభ ఎన్నికల మూడో దశ నేపథ్యంలో బీహార్‌ను ఆనుకుని ఉన్న నేపాల్‌ సరిహద్దును మూడు రోజుల పాటు మూసివేశారు. సరిహద్దు ప్రాంతాలైన మధు బని, ఖుటోనా, జయనగర్‌ నుంచి నేపాల్‌ మీదుగా వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. మంగళవారం బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సరిహద్దులను మూసివేశారు. మరోవైపు సరిహద్దు వద్ద భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు.

Read More

గడ్చిరోలిలో పేలుడు పదార్థాలు స్వాధీనం

మహారాష్ట్ర: గడ్చిరోలిలోని టిపగడ్‌ ప్రాంతంలో సోమవారం భద్రతా దళాలకు అందిన సమాచారం ప్రకారం పేలుడు పదార్థాలు, క్లైమోర్‌మైన్‌ల కోసం వెతకడానికి సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పేలుడు పదార్థాలు, డిటోనేటర్లతో నిండిన ఆరు ప్రెజర్‌ కుక్కర్లు, ష్రాప్‌ నెల్స్‌తో నిండిన మూడు క్లైమోర్‌ పైపులను కూడా కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల దృష్ట్యా అలజడి సృష్టించేందుకు మావోయిస్టు లు వాటిని అమర్చి ఉంటారని భావిస్తున్నారు.

Read More

పోస్టల్‌ బ్యాలెట్‌ బదులు ఈవీఎంతో ఓటింగ్‌

చిలకలూరిపేటలో ఎన్నికల అధికారి తప్పిదం ఓట్లు చెల్లుబాటు అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఈసీదే మే 14న చెన్నై తెలుగు విద్యార్థుల పరీక్షను రీ షెడ్యూల్‌ చేయాలి ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేత వర్ల రామయ్య వినతి మంగళగిరి, మహానాడు : చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌కు పేపర్లు ఇవ్వాల్సింది పోయి ఎన్నికల అధికారి అయిన తహసీల్దారు ఏకంగా ఈవీఎంను ఉపయోగించారని, వారు చేసిన తప్పుకు ఓట్లు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవా […]

Read More

రాజధాని లేని రాష్ట్రం ఏంట్రా?

-బుద్ధి జ్ఞానం ఏమైనా ఈ సీఎంకు ఉన్నాయా? -కూటమి నుంచి నేను ఆశించింది ఇదే -అమరావతి పునర్నిర్మాణంతో పాటు, రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్న అమిత్ షా -ఏపీ అంటే అమరావతి, పోలవరం -కేంద్రంలోని బిజెపి సహకారంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల ముందు చూపుతో అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెట్టడం ఖాయం -నరసాపురం పార్లమెంట్ సభ్యులు , ఉండి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ […]

Read More

దేశంలో అమృత ఘడియలు సాగుతుంటే… వైసీపీ పాలనలో రాష్ట్రంలో విష ఘడియలు

ఎటు చూసినా దోపిడీలు, కుంభకోణాలు నరేంద్ర మోదీ ముందుండి నడిపితేనే ఈ దోపిడీలు ఆగుతాయి వికసిత్ భారత్ కలలో ఐదు కోట్ల ఆంధ్రులు భాగస్వాములవుతాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుంది వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతుంది రాజమండ్రి ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలో భారత దేశం మొత్తం అమృత ఘడియలు కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్ […]

Read More

ఎన్డీయే మంత్రం అభివృద్ధి..వైసీపీ మంత్రం అవినీతి

 -ఏపీని లూటీ చేసిన జగన్ సర్కార్ – వైసీపీకి అవినీతి నిర్వహణ తప్ప రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదు – వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెడ్‌ స్పీడ్‌ – మే 13న ఏపీలో కొత్త ఆధ్యాయం – మోదీ గ్యారెంటీ..బాబు నాయకత్వం, పవన్‌ విశ్వాసం ఏపీకి అవసరం – రాజమండ్రి ఎన్నికల సభలో ప్రధాని మోదీ రాజమండ్రి: చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని . […]

Read More

తెలంగాణలో బీజేపీకి టీడీపీ మద్దతు

-టీడీపీ-బీజేపీ నేతల భేటీ -ఉమ్మడిగా ప్రెస్‌మీట్ హైదరాబాద్‌ : తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి తెలుగుదేశం మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు సాయిబాబా, కాట్రగడ్డ ప్రసూన, శ్రీపతి సతీష్ తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హైదరాబాద్‌లోని ఎనీ భవన్‌లో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ఓట్ల బదిలీ, ఎన్నికల ప్రచార […]

Read More

నార్సిస్టిక్ అనే మానసిక వైకల్యంతో ఉన్న సైకో జగన్

-ప్రజలు చస్తున్నా చూస్తూ నవ్వుకునే వ్యక్తి జగన్ -ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో ఐఏఎస్ లకే చిక్కులు ఇక సామన్యులకు చుక్కలే -జగన్ దోచిన డబ్బులు ప్రజలకు చేరాలి -సీమలో 198 ప్రాజెక్టులను జగన్ రద్దు చేశాడు -పాణ్యం ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు -ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడినందుకు తనపై కేసు పెట్టారని, ఏం చేసుకుంటారో చేసుకోండని చంద్రబాబు సవాల్ -జగన్ బొమ్మ […]

Read More