కోడలి మూర్ఖత్వంతో అనాథలా మామ మృతి

-ఇంటి తాళం లేక రోడ్డుపైనే శవం -స్థానికుల సహకారంతో అంత్యక్రియలు తిరుపతి, మహానాడు: కోడలి మూర్ఖత్వంతో మామ అనాథలా మృతిచెందిన ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. తిరుమలలో గత 50 సంవత్సరాలుగా జీవిస్తున్న శ్రీనివాసులు రెడ్డి, గురమ్మ అనే దంపతులకు ఒక కుమారుడు. తన పేరు మీద ఉన్న ఆస్తిని కుమారుడి పేరు మీద రాసి శేష జీవితం సాఫీగా గడుపుదామని అనుకున్నారు. ఇంతలో విధి ఆడిన నాటకంలో కుమారుడు అనారోగ్యంతో […]

Read More

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

అమరావతి: ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా చిరంజీవి ట్వీట్‌ చేశారు. కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నంద మూరి తారక రామారావును ఈ రోజు గుర్తుచేసుకుంటూ వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More

విద్యార్థులకు షూలు, రెండు జతల సాక్స్‌లు

-జూన్‌ 12 నాటికి స్కూల్‌ కిట్లు అందించాలి -పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ విజయవాడ: జూన్‌ 5వ తేదీ నాటికి అన్ని షూల(బూట్లు) రవాణా పూర్తి చేయా లని, జూన్‌ 12వ తేదీ నాటికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున స్కూల్‌ కిట్‌ అందేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదేశించారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే వారికి నల్ల […]

Read More

కాంగ్రెస్‌ పాలనలో ఏనాడు పూజలను అడ్డుకోలేదు

ఇండియా కూటమి వస్తే ఇంటి పెద్ద ఖాతాలో డబ్బు పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో భట్టివిక్రమార్క పంజాబ్‌: కాంగ్రెస్‌ తన 55 ఏళ్ల పరిపాలనలో ఏనాడు పూజా కార్యక్రమాలను అడ్డుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం పంజాబ్‌ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కొట్కపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిం చారు. సభకు ముందు ప్రధాన అతిథిగా విచ్చేసిన […]

Read More

ఫోన్‌ ట్యాపింగ్‌పై స్పందించిన రేవంత్‌ రెడ్డి

-అటువంటి వెధవ పనులు నేను చేయను -అధికారులు వారి పని చేసుకుపోతున్నారు -వారు ముగ్గురూ సీబీఐ విచారణ ఎందుకు కోరలేదు? -ఇప్పటివరకు ఆ వ్యవహారంపై సమీక్షించలేదని వ్యాఖ్య ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఇప్పటివరకు సీఎంగా సమీక్ష జరపలేదు. అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ల పనిలో […]

Read More

సురవరం చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

-శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకులు కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి -బషీర్‌బాగ్‌లో ప్రతాప్‌రెడ్డి 128వ జయంతి హైదరాబాద్‌: తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాప్‌రెడ్డి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు స్ఫూర్తి కలిగించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకులు, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత డాక్టర్‌ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం బషీర్‌బాగ్‌ దేశోద్దారక భవన్‌లో సురవరం ప్రతాప్‌రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించి న ప్రతాపరెడ్డి 128వ జయంతి వేడుకలకు ఆయన […]

Read More

డీజీపీకి వర్ల రామయ్య లేఖ

మంగళగిరి, మహానాడు: దళితుడైన నోముల మాణిక్యారావుపై దాడి ఘటనపై డీజీపీకి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మంగళవారం లేఖ రాశారు. దళితుడైన నోముల మాణిక్యారావును, ఆయన కుటుంబంపై జరిగిన దాడి గురించి ఇది వరకే ఫిర్యాదు చేశామని తెలిపారు. మంగళగిరి రూరల్‌ స్టేషన్‌లో హత్యాయత్నంపై ఆధారాలు ఇచ్చినా 307 సెక్షన్‌ను చేర్చలేదని తెలిపారు. ఎన్నికల ఏజెంటుగా కూర్చున్నందుకే మాణిక్యారావును హత్య చేసేందుకు దాడి చేశారని వివరించారు. ఎస్‌ఐకు […]

Read More

లిక్కర్‌ స్కామ్‌ విచారణలో కేసీఆర్‌ ప్రస్తావన

-మీడియాలో కథనాలను ఖండిరచిన కవిత న్యాయవాది -తప్పుగా అన్వయించుకున్నారని మండిపాటు ఢిల్లీ హైకోర్టులో మంగళవారం లిక్కర్‌ స్కామ్‌ విచారణ జరిగింది. అయితే మద్యం విధానం, రిటైల్‌ వ్యాపారం గురించి కేసీఆర్‌కు కవిత ముందే వివరాలు చెప్పినట్లు ఈడీ వాదనలు వినిపించిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని కవిత న్యాయవాది మోహిత్‌రావు ఖండిరచారు. ఈడీ వాదనల్లో కేసీఆర్‌ ప్రస్తావన జరగలేదు. కోర్టులో ఈడీ న్యాయవాదులు ప్రస్తావించింది మాగుంట రాఘవరెడ్డి తండ్రి […]

Read More

అమరావతిలో మళ్లీ ‘భూమ్‌’ ధామ్‌

-గెలుపోటములపై ఒక్కసారిగా మారిన లెక్కలు -కూటమి ఖాయమన్న సంకేతంతో భూములకు రెక్కలు -ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌ వ్యాపారం -ఎకరం కోటికి పైనే…అయినా అమ్మేవారు లేరు -రాజధాని ప్రాంతం చుట్టూ రియల్‌ వ్యాపారుల చక్కర్లు -ఐదేళ్ల అరాచక పాలన పోతుందన్న ఆనందంలో రైతులు వాసిరెడ్డి రవిచంద్ర ఏపీ రాజధాని అమరావతి సీఆర్‌డీఏ పరిధిలోని భూములకు అమాంతంగా రెక్కలు వచ్చాయి. రెండురోజులుగా భూముల ధరలు ఆకాశాన్నంటాయి. కేంద్రం లో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో […]

Read More

రేపు విదేశాల నుంచి చంద్రబాబు రాక

అమరావతి, మహానాడు: విదేశీ పర్యటకు వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. పోలింగ్‌ తరువాత ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 8.30కు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. విమానాశ్రయంలో పార్టీ నేతలు స్వాగతం పలకనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌ నివాసానికి చేరుకుంటారు.

Read More