ఎన్నికల అధికారికి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఫిర్యాదు వివరణ ఇవ్వాలని పర్యవేక్షకుడిపై సీరియస్ నంద్యాల: పాణ్యం అర్జీఎం కాలేజ్లో రెండు స్ట్రాంగ్రూమ్ల దగ్గర సీసీ కెమెరాలు పనిచేయలేదు. నంద్యాల, డోన్ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్రూమ్ల దగ్గర సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారికి టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షకులపై ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు. […]
Read Moreపవిత్ర హజ్ యాత్ర ప్రారంభం
గన్నవరం: పవిత్ర మజ్ యాత్రను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ చైర్మన్, ప్రభుత్వ కార్యదర్శి హర్షవర్ధన్ సోమవారం గన్నవరం ఈద్గా జామా మసీదు హజ్ క్యాంపు నుంచి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వక్ఫ్ బోర్డు సీఈవో, హజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్, హజ్ కమిటీ సభ్యులు, సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీంబాషా, దూదేకుల కార్పొరేషన్ ఎండీ గౌస్ పీర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్వలి, తదితరులు యాత్రికులకు […]
Read Moreనరసన్నపేటలో స్క్రాప్ గోడౌన్ దగ్ధం
శ్రీకాకుళం, మహానాడు: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక హెచ్పీ గ్యాస్ గోడౌన్ దగ్గర ఉన్న స్క్రాప్ గోడౌన్ సోమవారం ఉదయం అగ్నికి ఆహుతి అయింది. గుర్తుతెలియని దుండగులు దీనిని తగలబెట్టి ఉండవచ్చునని స్క్రాప్ గోడౌన్ యజమాని కోరాడ వైకుంఠరావు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.70 లక్షలు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Moreజనసేన నేత కర్రి మహేష్ కారుకు నిప్పు
-మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తల అరాచకం -చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు అరాచకం సృష్టిం చారు. జనసేన నాయకుడు కర్రి మహేష్ ఇంటి ముందు పార్కు చేసిన కారుకు నిప్పు పెట్టి తగులబెట్టారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత కారును వైకాపా గూండాలు తగులబెట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం […]
Read Moreమాజీ మంత్రి సీతాదేవి కన్నుమూత
-ఎన్టీఆర్ కేబినెట్లో గుర్తింపు -సంతాపం ప్రకటించిన చంద్రబాబు విజయవాడ, మహానాడు: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి హైదరాబాద్లో గుండెపోటుతో మృతిచెందారు. ఆమె 1985,1994లలో ముదినేపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1988లో ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయ డెయిరీ డైరెక్టర్గా ఉన్నారు. ఆమె మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలు శాసనసభ్యురాలిగా ఎన్నికైన సీతా దేవి, విద్యాశాఖా మంత్రిగా తనదైన […]
Read Moreకళాపిపాసి ‘అలమండ ప్రసాద్’
-శాస్త్రీయ నృత్యంలో రాణిస్తూ వేలాదిగా ప్రదర్శనలు -సాగర సంగమం ప్రేరణతో చిన్నవయసులోనే అరంగేట్రం -దేశ, అంతర్జాతీయంగా అవార్డులు, రికార్డులు సొంతం -గిన్నిస్, వండర్, తెలుగు బుక్ రికార్డ్స్లో స్థానం -కళాకారులను ప్రోత్సహిస్తూ ముందడుగు కాకినాడ, మహానాడు: ‘సాగర సంగమం’ చిత్రంలో కమల్హాసన్ నృత్య ప్రదర్శన గుర్తుండే ఉంటుంది. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక కలికితురాయిగా నిలిచిపోయే ఈ సినిమా ఎందరో కళాకారులకు ప్రేరణగా నిలిచిందనడంలో అతిశయోక్తి కాదు. ఈ […]
Read Moreరైతుల పంట నష్టపరిహారం బొక్కేశారు!
-ఫేక్ ఖాతాలు సృష్టించి నగదు మళ్లింపు -మార్కెట్ యార్డ్లో కంప్యూటర్ ఆపరేటర్ నిర్వాకం -వ్యవసాయశాఖలో రూ.3.72 కోట్ల స్వాహా -నోరుమెదపని పెడన వ్యవసాయాధికారి -వైసీపీ నేతలతో కలిసి కుంభకోణంపై అనుమానం -కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన పెడన, మహానాడు: కృష్ణా జిల్లా పెడనలో న్యూట్రిషన్ చేసుకునే వ్యక్తి వ్యవసాయ శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ రూ.3.72 కోట్లు స్వాహా చేసిన ఘటన వెలు గులోకి వచ్చింది. అయితే వ్యవసాయాధికారి […]
Read Moreరాష్ట్రంలో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు
అమరావతి: నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు రాష్ట్రంలో వేడి, ఉక్కపోత కొనసా గుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సోమవారం నుంచి జూన్ 3 వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్ఠంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. కానీ రెమాల్ తుఫాన్ బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. అటు తెలంగాణలోనూ జూన్ 1 వరకు పొడి వాతావరణం కొనసాగనుంది.
Read Moreఒకే కుటుంబంలో నలుగురి దుర్మరణం
-కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -కారు అదుపుతప్పి లారీని ఢీకొనడంతో ఘటన -మృతులంతా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తింపు గన్నవరం, మహానాడు: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ సీఐ అల్లు లక్ష్మీనరసింహ […]
Read Moreకౌంటింగ్పై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు
-ఓట్ల లెక్కింపును విజయవంతంగా నిర్వహించాలి -అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి -రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు అమరావతి, మహానాడు: ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఆయన అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు కౌంటింగ్పై పలు సూచనలు చేశారు. కౌంటింగ్ విజయవంతంగా […]
Read More