సుప్రీంకోర్టు జడ్జిని కలిసిన కలెక్టర్‌

గుంటూరు: సుప్రీంకోర్టు జడ్జి సి.టి.రవికుమార్‌ను గురువారం సెక్రటేరియట్‌ సమీపాన ఉన్న విట్‌ విశ్వవిద్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు విట్‌ యూనివర్సిటీ ప్రాంగణా నికి చేరుకున్న ఆయనకు జిల్లా జడ్జి పార్థసారథి, జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకు మారి, గుంటూరు ఆర్డీవో పి.శ్రీకర్‌ సాదర స్వాగతం పలికారు.

Read More

నేడు బీజేపీ ప్రచారానికి మధ్యప్రదేశ్‌ సీఎం రాక

హైదరాబాద్‌, మహానాడు : వరంగల్‌- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నాయకుల పర్యటన వివరాలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారి బంగారు శృతి వెల్లడిరచారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ సాయంత్రం 6 గంటలకు వరంగల్‌లో ఓరుగల్లు సిటిజన్‌ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. వర్ధన్నపేట నియోజకవర్గం లో సాయంత్రం నాలుగు గంటలకు మడికొండలోని పీఎన్‌ఎన్‌ ఫంక్షన్‌ హాలులో జరిగే గ్రాడ్యుయేట్‌ సదస్సులో బీజేపీ […]

Read More

సెల్‌ టవర్‌ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం

సెల్‌ఫోన్‌ చోరీ చేశాడని నిందలు వేశారని మనస్థాపం చాకచక్యంగా కిందకు దింపిన పోలీసు సిబ్బంది కాకినాడ, మహానాడు : చేయని దొంగతనాన్ని తనపై మోపడంతో అవమానం భరించలేని ఓ యువకు డు సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ యువకుడు ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన జిల్లా కేంద్రం కాకినాడలో జరిగింది. కాకినాడ జిల్లా చిత్రాడకు చెందిన ప్రదీప్‌కుమార్‌ను సెల్‌ఫోన్‌ దొంగతనం చేశావంటూ […]

Read More

డీజీపీకి దేవినేని ఉమ లేఖ

పల్నాడులో హింసపై ఆధారాలు వైసీపీ మూకలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు మంగళగిరి, మహానాడు : డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు లేఖ రాసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహే శ్వరరావు గురువారం లేఖ రాశారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరులు సాగించిన హింసాకాండకు సంబంధించిన ఆధారాలతో సహా ఇస్తున్నాం. మాచర్ల మండలం రాయవరం గ్రామంలోని 51వ పోలింగ్‌ బూత్‌లో వైసీపీ గూండాలు టీడీపీ ఏజెంట్లను బయటకు లాగి దాడి చేసి […]

Read More

మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం

రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తాం మహేశ్వర్‌రెడ్డి అసత్య ఆరోపణలు మానుకో ఉత్తమ్‌కుమార్‌ వైట్‌ పేపర్‌లాంటి వాడు తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హైదరాబాద్‌, మహానాడు : గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు రెండు రకాలు ఉంటాయి. వాస్తవాలు మాట్లాడే వారు ఉంటారు.. రెండవ రకం ఏది లేకపోయినా అవాస్తవాలని […]

Read More

పిన్నెల్లి పరారీ…పోలీసుల అసమర్థతకు నిదర్శనం

సీబీఐని రంగంలోకి దింపి అరెస్టు చేయాలి చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట: మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి సోదరుల పరారీ ఉదంతం రాష్ట్ర పోలీసుల చేతగానితనానికి నిదర్శమనని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తి పాటి పుల్లారావు ధ్వజమెత్తారు. పిన్నెల్లి అరెస్టులో జరుగుతున్న జాప్యంపై గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆయన స్పందించారు. జరుగుతున్నవి చూస్తుంటే పిన్నెల్లిని పోలీసులే విహారయాత్రకు పంపినట్లుందని ధ్వజమెత్తారు. పిన్నెల్లిని ఏపీ పోలీసులు అరెస్టు చేస్తారనే […]

Read More

పిన్నెల్లి వీడియో ఎలా వచ్చిందో చెప్పాలి

ఎన్నికల కమిషన్‌ పక్షపాతంగా వ్యవహరిస్తోంది మాచర్లలో రిగ్గింగ్‌కు ఎస్పీ సహకరించాడు నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తాడేపల్లి, మహానాడు : వైసీపీ కేంద్ర కార్యాలయంలో నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమా ర్‌ యాదవ్‌ గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేతలు సత్యహరిచంద్రులన్నట్లుగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోందన్నారు. మాచర్లలో పలు ప్రాంతాలలో రిగ్గింగ్‌ జరుగుతుందని ఎస్పీకి ఫోన్‌ చేస్తే స్పందించలేదని, ఎస్పీ రిగ్గింగ్‌కు సహకరించాడని ఆరోపించారు. […]

Read More

నరసరావుపేటలో స్ట్రాంగ్‌రూమ్‌ తనిఖీ

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ కౌంటింగ్‌కు పటిష్ఠ బందోబస్తుపై సూచనలు నరసరావుపేట, మహానాడు : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి నరసరావుపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జేఎన్‌టీయూ కళాశాల ప్రాంగణంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ దగ్గర గురువారం పల్నాడు జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ లాత్కర్‌, ఎస్పీ మల్లికా గార్గ్‌ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్‌కు సంబంధించి జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ […]

Read More

సీఎస్‌ జవహర్‌రెడ్డికి అన్నీ తెలిసే జరుగుతున్నాయి

ఏపీలో రాజారెడ్డి రాజ్యం కొనసాగుతోంది ఓడిపోతామని తెలిసి లండన్‌ వెళ్లి కుట్రలు సినీ నిర్మాత నట్టికుమార్‌ వ్యాఖ్యలు హైదరాబాద్‌, మహానాడు : రాష్ట్రంలో పరిస్థితులపై సినీ నిర్మాత నట్టికుమార్‌ స్పందించారు. సీఎస్‌ జవహర్‌ రెడ్డికి అన్నీ తెలిసే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. జగన్‌ శిష్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొడుతుంటే ఎన్నికల సిబ్బంది, ఈసీ, పోలీసులు పట్టించుకోలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిస్తే తప్ప చర్యలు తీసుకోలేదు. వైసీపీ వారే […]

Read More

సీఎంవో అధికారి డైరెక్షన్‌లో పిన్నెల్లి భద్రం

కావాలనే తప్పించి ఈసీ ముందు దొంగనాటకాలా? పోలీసులు ఎవరి ఆధీనంలో ఉన్నారో ఈసీ చెప్పాలి వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు : రాష్ట్ర పోలీసులు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారో ఈసీ చెప్పాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ప్రశ్నించారు. ఈవీఎం పగులకొట్టిన రౌడీని పట్టుకోలేకపోవడం సిగ్గుచేటు కాదా అని ధ్వజమెత్తారు. హౌస్‌ అరెస్టు నుంచి తప్పించుకున్న వెంటనే పిన్నెల్లిని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. అరెస్టు యత్నానికి ముందు […]

Read More