ప్రత్యేక ఆకర్షణగా ట్యాంక్‌ బండ్‌

-తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు -ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు హైదరాబాద్‌: తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్‌ బండ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్‌ బండ్‌ను సర్వాంగ సుందరం గా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్‌ బండ్‌ పరిసరాలను రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించనున్నారు. జూన్‌ 2న ఆవిర్భావ వేడుకలకు సీఎం […]

Read More

హజ్‌ యాత్రకు రెండో బృందం

గన్నవరం: పవిత్ర హజ్‌ యాత్ర రెండో బృందానికి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, హజ్‌ ఆపరేషన్స్‌ చైర్మన్‌ హర్షవర్ధన్‌ బుధవారం మధ్యాహ్నం గన్నవరం ఈద్గా జామా మసీద్‌ హజ్‌ క్యాంప్‌ దగ్గర పచ్చ జండా ఊపి ప్రారంభించారు. 322 మందితో విమానంలో జెడ్డా బయలుదేరివెళ్లారు. వక్ఫ్‌ బోర్డ్‌ సీఈవో, హజ్‌ కమిటీ ఈవో అబ్దుల్‌ ఖదీర్‌, హజ్‌ కమిటీ సభ్యులు, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ అలీం బాషా, దూదేకుల […]

Read More

రెండు స్కామ్‌లపై దర్యాప్తునకు ఆదేశించాలి

-ఆ రెండు చట్టాలు తప్పనిసరిగా రద్దు చేయాలి -మాజీ అధికారి పి.వి.రమేష్‌ అమరావతి: మాజీ అధికారి పి.వి.రమేష్‌ ట్విటర్‌ వేదికగా మరో ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 1953 నుంచి భూమిలేని నిరుపేదలకు వారి జీవనో పాధి కోసం లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని అసైన్డ్‌ చేశారు. కానీ, అమ్మకానికి కాదు. ఏపీ అసైన్డ్‌ ల్యాండ్స్‌ (సవరణ) చట్టం 2023 ఈ భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేదల నుంచి […]

Read More

కేసీఆర్‌తో లాలూచీ పడ్డావా రేవంత్‌?

-ఫోన్‌ ట్యాపింగ్‌లో ఎందుకు అరెస్టు చేయరు? -బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హైదరాబాద్‌: ఢిల్లీలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్‌ మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం పట్టనట్టే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌లో జరిగిన అవినీతి, అక్రమాల చిట్టాను వెలికితీసి నిందితులను జైలుకు […]

Read More

న్యూయార్క్‌ టైంస్క్వేర్‌పై ఎన్టీఆర్‌ చిత్రమాలిక

న్యూయార్క్‌ టైంస్క్వేర్‌పై ఎన్టీఆర్‌ చిత్రమాలిక ప్రదర్శితమైంది. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మొట్టమొదటి సారిగా 200 అడుగులు ఎత్తు, 36 అడుగులు వెడల్పు తో ఎన్టీఆర్‌ చిత్రాలను ప్రదర్శించడం తెలుగువారికి దక్కిన గౌరవమని తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం మే 27న అర్ధరాత్రి నుంచి మే 28 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ‘అన్న ఎన్టీఆర్‌’ చిత్రమాలికను ప్రదర్శించారు.

Read More

అమరావతి సామగ్రి దొంగల భరతం పడతాం

-కూటమి రాగానే జైలుకు పంపుతాం -వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ: కూటమి ప్రభుత్వంలో అమరావతి సామగ్రి దొంగలందరి భరతం పట్టడం ఖాయమని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు హెచ్చరించా రు. ఐదేళ్లుగా రాజధాని ప్రాంతాన్ని వైకాపా దొంగల ముఠా దోచుకుంటోందని వాళ్లందరిపై కూటమి ప్రభుత్వంలో కఠినచర్యలు తప్పవన్నారు. కేవలం చంద్రబా బుకు పేరొస్తుందనే ఒకే ఒక్క కారణంతోనే అమరావతి ఉసురు తీసిన అధికార వైకాపా శాశ్వత సమాధికి ఇక్కడి […]

Read More

1200 మంది ఫోన్ల ట్యాపింగ్‌

-ప్రభాకర్‌రావు సాయంతో వ్యవహారం -కాంగ్రెస్‌ రాగానే ధ్వంసం చేయమన్నాడు -వాంగ్మూలంలో ప్రణీత్‌రావు కీలక విషయాలు హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రణీతరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడిరచారు. 1200 మంది ఫోన్లను టాప్‌ చేసినట్లు పేర్కొన్నారు. న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి […]

Read More

సజ్జల వాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు

అమరావతి: ఎన్నికల కమిషన్‌ను కించపరిచే వాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారె డ్డిపై చర్యలు తీసుకోవాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం బుధవారం వెలగపూడి సచివాలయంలో ఎన్నికల కమిషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు వైరస్‌ తాకిందని సజ్జల వాఖ్యలు చేయ డం గురించి వివరణ తీసుకుని అయనపై తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు.

Read More

బీర్ల కొరత పేరుతో మరో దోపిడీకి తెరతీశారు

-కొత్త బ్రాండ్లకు అనుమతి ఎలా మంజూరు చేశారు? -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.వి.సుభాష్‌ హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్‌ ఎన్‌.వి.సుభాష్‌ మాట్లాడా రు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు లిక్కర్‌ మార్గం ఎంచుకుంది.రాష్ట్రంలో బీర్ల కొరత సృష్టించి, 5 కొత్త బ్రాండ్లను తీసుకొచ్చింది.కొత్త బ్రాండ్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే ప్రయత్నం […]

Read More

టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు సమీక్ష

-రెండురోజులు కౌంటింగ్‌ ఏజెంట్లకు శిక్షణ -ఏర్పాట్లు చేయాలని నాయకులకు ఆదేశం -175 సీట్లకు 120 మంది పరిశీలకులపై అభ్యంతరం -ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని వ్యాఖ్య హైదరాబాద్‌: విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం పార్టీ కీలక నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ నెల 31న శుక్రవారం పార్టీ చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లతో సమావేశం, జూన్‌ 1న జోనల్‌ స్థాయిలో కౌంటింగ్‌ ఏజెంట్లకు టీడీపీ […]

Read More