పమిడిపాడు శివారులో మహిళ హత్య!

నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, పమిడిపాడు శివారులో దారుణం జరిగింది. భార్య త్రివేణి(32)ని కత్తితో పొడిచి భర్త మురళి హత్య చేశాడు. అనంతరం పారిపోతుండగా కారంపూడి మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన మురళీని నరసరావుపేట లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. భర్త మురళి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. త్రివేణి స్వగ్రామం బెల్లంకొండ మండలం […]

Read More

రైల్వే శాఖ రద్దు చేసిన ఎన్ఓసి అమలుపై నిర్లక్ష్యం!

– పట్టణ ప్రణాళిక అధికారులు, సూపరింటెండెంట్‌, గుమస్తాలకు షోకాజ్ నోటీసులు – నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కు రైల్వే శాఖ రద్దు చేసిన ఎన్ఓసి అమలుపై నిర్లక్ష్య వైఖరి కనబరిచిన ప్రణాళిక అధికారులకు, సంబంధిత సూపరింటెండెంట్‌, గుమస్తాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ […]

Read More

పరిశుభ్రత… ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది!

– కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, మహానాడు: పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది వేయవచ్చని, స్వాతంత్య్రం కంటే స్వచ్ఛతకే గాంధీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా ముంగిపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని, మాట్లాడారు. స్వాతంత్య్రం, సమానత్వం, అహింస కోసం గాంధీజీ నిరంతరం కృషి చేశారన్నారు. […]

Read More

వరద బాధితులకు దాతల ఆపన్న హస్తం

అమరావతి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున స్పందిస్తూనే ఉన్నారు. అనంతపురం ఎంఎల్ఏ దగ్గుబాటి ప్రసాద్, ఆయన అనుచరులు రూ.11,28,100 ల చెక్కును మంత్రి లోకేష్ కు అందించారు. అదేవిధంగా మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ. 50,116, మంగళగిరికి చెందిన ప్రముఖులు అందే హరికుమారి రూ. 2లక్షలు, దామర్ల రామారావు రూ.1,01,116 అందజేశారు. దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Read More

అవ్వతాతలకు పెద్దకొడుకుగా చంద్రన్న

-రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే 1వ తారీఖున ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ జరుగుతుంది. చంద్రన్నే మా పెద్ద కొడుకు అంటూ అవ్వాతాతలు ఆనంద సాగరంలో తెలియాడుతున్నారు. అదే విధంగా రేషన్ సరుకుల్లో గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ దుకాణల్లో కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేసేవారు. అది కూడా రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్మి సొమ్ము […]

Read More

అహింస, శాంతి సమాజం కోసం కృషి చేద్దాం

– ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: గాంధీ చూపిన అహింస, శాంతి సమాజం కోసం కృషి చేద్దామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. బుధవారం గాంధీ జయంతి పురస్కరించుకొని గుంటూరులోని పట్టాభిపురం మెయిన్ రోడ్డు, హిమనీ సెంటర్ లలో మహాత్మా గాంధీ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… గాంధీ బాటలో అందరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందని, […]

Read More

సీఎం కంటే.. సెక్రటరీనే ‘పవర్’ఫుల్లట

– బాబు.. లోకేష్ కంటే సీఎంఓ సెక్రటరీ ప్రద్యుమ్న సుప్రీం -మూడునెలలు దాటినా బాబు, లోకేష్ పీఆర్వోలకు దక్కని అపాయింట్‌మెంట్ ఆర్డర్లు – వారు ఇంకా ప్రైవేటు జీతగాళ్లగానే చెలామణి – అసలు ఇప్పటిదాకా సీపీఆర్‌ఓనే నియమించని వైనం – బాబు సెక్రటరీ ప్రద్యుమ్న పీఆర్వోలకు మాత్రం రెండు సీఎం మీడియా కో ఆర్టినేటర్స్ పోస్టులు – నెలకు 90 వేల జీతంతో జీఓ జారీ – లేని నిబంధనలు […]

Read More

బందరు పోర్టు ను సందర్శించిన బాబు

మచిలీపట్టణం: కృష్ణా జిల్లా లో పర్యటనలో భాగంగా మచిలీపట్టణం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనలో స్వల్ప మార్పు చేసుకున్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో రాష్ట్ర గనులు, ఆబ్కారీ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి చేసిన విజ్ఞప్తి మేరకు మచిలీపట్టణం పోర్ట్ ను అధికారులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి పరిశీలించారు. అధికారులు, పోర్ట్ ఇంజినీర్లతో కలిసి బందరు పోర్ట్ మాస్టర్ ప్లాన్ పరిశీలించి, […]

Read More

డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరిని ఓటర్లు నమోదు చేయించాలి

– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ పెదకూరపాడు, మహానాడు: స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐదు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ తమ ఓట్లు నమోదు చేసుకునేలా నాయకులు పనిచేయాలని సూచించారు. అన్ని […]

Read More

విలువలతో కూడిన విద్య అవసరం

– ఎస్పీ సరిత గుంటూరు, మహానాడు: నేటి విద్యా విధానంలో విలువలతో కూడిన బోధన అవసరమని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.జి.వి. సరిత పేర్కొన్నారు. ఇక్కడి భాష్యం విద్యాసంస్థల ఆడిటోరియంలో బుధవారం జరిగిన మానవత ఆవిర్భావ దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులలో మానవత విలువలు, పోటీ తత్వం, సానుకూల దృక్పథాలను చిన్న వయసు నుండే నేర్పాలని కోరారు. 145 కోట్ల జనాభా […]

Read More