వీధి దీపాలను తక్షణమే బాగుచేయించండి

48 గంటల్లో కార్యాచరణ ప్రణాళిక అవసరమైన మెటీరియల్‌కు ప్రతిపాదనలు తాగునీటి రిజర్వాయర్లను శుభ్రం చేయండి కలుషిత నీటి సరఫరా ఫిర్యాదులపై స్పందించండి పూడికతీత ఫొటోలను గ్రూప్‌లో పోస్ట్‌ చేయాలి గుంటూరు కమిషనర్‌ చేకూరి కీర్తి ఆదేశం నగర సమస్యలపై అధికారులతో సమీక్ష గుంటూరు: నగరపాలక సంస్థ పరిధిలోని వీధి దీపాలు అన్నీ వెలిగేలా చర్యలు తీసుకోవాలని, వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుండే అందే ఫిర్యాదులు 48 గంటల్లో పరిష్కరించేలా […]

Read More

రాజకీయాలకు కేశినేని నాని బై బై

అమరావతి: విజయవాడ వైసీపీ ఎంపీగా పోటీ చేసి సోదరుడి చేతిలో పరాజ యం పాలైన కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీ యాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ ఎంపీగా కొనసాగుతూ వైసీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కొంచెం ఒద్దికగా ఉండి టీడీపీని అంటి పెట్టుకుని ఉండి ఉంటే అవకాశాలు దక్కేవని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రమంత్రి అవ్వాల్సిన వ్యక్తి నేడు కేవలం ఒక […]

Read More

కోటప్పకొండకు టీడీపీ శ్రేణుల పాదయాత్ర

ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ నరసరావుపేట: నియోజకవర్గంలో జగన్‌రెడ్డి అరాచకాలను, అకృత్యాలకు ఎదు రొడ్డి చదలవాడ అరవిందబాబు గెలిచిన నేపథ్యంలో పమిడిపాడు గ్రామ టీడీపీ నేతలు కోటప్పకొండకు పాదయాత్ర చేపట్టారు. చదలవాడ అరవిందబాబు దగ్గరుండి పాదయాత్రను ప్రారంభించారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని అడ్డుకునే సత్తా ఎవరికీ లేదన్నారు. ప్రజల అండ, కార్యకర్తల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైందని […]

Read More

కష్టపడిన కార్యకర్తకు దక్కిన గౌరవం

పార్టీ బలోపేతానికి మరింత కష్టపడతా. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ ఢిల్లీ: పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తకు అవకాశాలు ఉంటాయని చెప్పేందుకు తానే ఉదాహరణ అని నరసాపురం ఎంపీ, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. కేంద్రమంత్రిగా అవకాశం రావడం సంతోషకరంగా ఉందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బీజేపీ కార్యకర్తలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రోత్సహించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని, పార్టీ బలోపేతానికి మరింత కష్టపడతానని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో సంబరాలు మోదీ భారత ప్రధాని […]

Read More

ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

మంగళగిరిలో కేక్‌ కట్‌చేసిన వర్ల రామయ్య శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు అమరావతి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కేక్‌ కట్‌ చేసి ఏపీ నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ, సినీ నిర్మాత, దక్షిణ భారత నిర్మాతల సంఘ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్‌కు తినిపించారు. స్వీట్లు […]

Read More

ఐప్యాక్‌ టీం మోసం చేసింది..

తిరువూరు వైసీపీ అభ్యర్థి స్వామిదాస్‌ తిరువూరు: ఆరా మస్తాన్‌ అడ్డంగా ముంచేశాడని తిరువూరు వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్‌ మండిపడ్డారు. తిరువూరు ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆర్థికంగా దెబ్బతిన్నాం.. కొన్ని పొరపా ట్లు జరిగాయి..ఐప్యాడ్‌ టీం మోసం చేసింది.. ఆరా మస్తాన్‌ అడ్డంగా ముంచేశా డని ఆవేదన వెళ్లగక్కారు.

Read More

పేలిన కెమికల్‌ ట్యాంకర్‌

హైదరాబాద్‌: దుండిగల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఖాజిపల్లి చౌరస్తాలో ఓ వెల్డింగ్‌ షెడ్‌లో కెమికల్‌ ట్యాంకర్‌కు వెల్డింగ్‌ చేస్తుండగా ట్యాంకర్‌ పేలింది. దాంతో చుట్టుపక్కల ఉన్న పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. వెల్డింగ్‌ చేస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. దుండిగల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More

కేంద్రమంత్రులకు శుభాకాంక్షలు: రేవంత్‌

హైదరాబాద్‌: తెలుగురాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి.కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ కుమార్‌, కె.రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతిరాజు శ్రీనివాస వర్మకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా ఆకాంక్షించారు.

Read More

జగన్‌ కుటుంబం కలిసిపోవాలి

పూనమ్‌కౌర్‌ ఆసక్తిక ట్వీట్‌ వైరల్‌ భిన్నంగా స్పందిస్తున్న వైసీపీ అభిమానులు అమరావతి: టాలీవుడ్‌ ప్రముఖ నటి పూనమ్‌ కౌర్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పు డు సినిమాలకు దూరంగా ఉంది. అయితే సినిమాయేతర విషయాలతో ఎక్కువ గా వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యం గా చేసుకుని పూనమ్‌ చేసే ట్వీట్లు నెట్టింట […]

Read More

జగన్‌పై తిరుగుబాటు చేసిన గిరిజనులకు ధన్యవాదాలు

12న ప్రమాణస్వీకారానికి పెద్దఎత్తున తరలిరండి టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధారునాయక్‌ అమరావతి: రాష్ట్రంలో కూటమి గెలిచిన ఐదు గిరిజన నియోజవర్గాల్లోనే కాకుం డా మిగిలిన 159 నియోజకవర్గాలలో జగన్‌పై తిరుగుబావుటా ఎగురవేసి కూటమికి మద్దతు తెలిపిన గిరిజన ఓటర్లకు పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, అదే స్పూర్తితో ఈ నెల 12న గన్నవరంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం తెలియజే యాలని టీడీపీ ఎస్టీ […]

Read More