చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని అనుకోవద్దు ప్రమాణ స్వీకార ముహూర్తం బలమైనది రుషికేశ్ వెళుతున్నా..ముందుగా ఆశీర్వదిస్తున్నా ఆయన గొప్పగా పరిపాలిస్తారు ఈసారైనా దేవాలయాల పాలన బాగుండాలి అమరావతిలోనూ శారదాపీఠం నిర్మిస్తాం విశాఖ స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలు విశాఖపట్నం: శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి సోమవారం మీడియా సమావేశంలో కూటమి గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభు త్వం మారింది. గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్లం తప్ప సంపాదన […]
Read Moreపీఎం కిసాన్పై మోదీ తొలి సంతకం
-17వ విడత నిధుల విడుదల -9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోదీ పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి తొలి సంతకం చేశారు. అనంతరం మాట్లాడుతూ మాది కిసాన్ కళ్యాణ్కు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం. అందుకే తొలి సంతకం రైతు సంక్షేమానికి సంబంధించిన కావడం సముచితమని పేర్కొన్నారు. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి మరింత కృషి చేయాలని మేము […]
Read Moreజగన్పై ఎంపి,ఎమ్మెల్యేల తిరుగుబాటు?
– ముగ్గురు ఎంపి, ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్? – బీజేపీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు? – అదే దారిలో రాజంపేట ఎంపి మిథున్రెడ్డి, తిరుపతి ఎంపి గురుమూర్తి, అరకు ఎంపి తనూజారాణి ? – కడప ఎంపి అవినాష్ దారెటు? – ‘అన్న’ జగన్ కోసం పదవిని త్యాగం చేస్తారా? – అరెస్టు కాకుండా ‘కమల’వనంలో చేరతారా? – ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో అవినాష్ – లోక్సభకు పోటీచేసే యోచనలో జగన్? […]
Read Moreచంద్రబాబు ప్రమాణస్వీకారానికి కేసరపల్లి ముస్తాబు
-11 ఎకరాల్లో చకచకా ఏర్పాట్లు -లక్ష మందికి పైగా వస్తారని అంచనా -ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల సీఎంల రాక -భారీ భద్రతపై అధికార యంత్రాంగం ఫోకస్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధమవుతోంది. ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. 11 ఎకరాల స్థలంలో జెట్ స్పీడ్తో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐదుగురు […]
Read Moreవేములవాడ ఆలయానికి భక్తుల తాకిడి
వేములవాడ: స్థానిక రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని సేవలో తరించారు. స్వామి వారికి ఇష్టమైన సోమవారం రోజు కావడంతో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
Read Moreమెగా డీఎస్సీపై తొలి సంతకం
-ఏపీలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ -చంద్రబాబు ప్రమాణస్వీకారంలో ప్రకటనకు సిద్ధం అమరావతి: రాష్ట్రంలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతేడాది జూలైలో లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. 2023 జూలై 31న లోక్సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి ఈ సమాధానమిచ్చారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 2022-23లో 39,008, 2021-22లో 38,191, 2020-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు […]
Read Moreఏపీ ఎస్సీ, ఎస్టీ హక్కుల వేదిక అధ్యక్షుడిగా గరికిముక్కు సుబ్బయ్య
అమరావతి: ఏపీ ఎస్సీ, ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడిగా గరికిముక్కు సుబ్బయ్యను నియమించినట్లు సామాజిక సమరసత వేదిక అఖిలభారత కన్వీనర్ శ్యాంప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్న తి కోసం ఆయనను నియమిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందరికీ సమానమైన అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా […]
Read Moreజగన్ కు నారా లోకేష్ హెచ్చరిక
-జగన్ ఓడినా రక్తచరిత్ర ఆపలేదు -హత్యారాజకీయాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు -వైసీపీ ఫ్యాక్షన్ దాడులకు చెక్ పెడతాం -గౌరీనాథ్ కుటుంబానికి అండగా ఉంటాం -నిందితులను వదిలే ప్రసక్తే లేదు అమరావతి: వైసీపీ దాడులపై, కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త హత్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వైఎస్ జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకి చెందిన […]
Read Moreనారా లోకేష్ను కలిసిన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఉండవల్లిలోని నివాసంలో పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, మర్యాదపూర్వకంగా కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. భారీ మెజారిటీలతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను లోకేష్ అభినందించారు. తనని కలవడానికి వచ్చిన కార్యకర్తలను అప్యాయంగా పలకరించి అందరితో ఫొటోలు దిగారు.
Read Moreమాజీ మంత్రి తలసాని సోదరుడి మృతి
హరీష్రావు, ఎర్రబెల్లి నివాళి హైదరాబాద్: మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ అనారోగ్యంతో చికిత్సపొందుతూ సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. బోయిన్పల్లి […]
Read More