రికార్డులు మార్చి వైసీపీ నేతల భూ దోపిడీ

ఫలితాలు వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల తారుమారుతో వైకాపా నాయకులు సాగిస్తున్న భూదోపిడీ ప్రమాదకర స్థాయికి చేరిందని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపా టి పుల్లారావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూముల కబ్జాలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పులపై కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఇటీవలి హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం ఆయన స్పందించారు. రెవెన్యూ […]

Read More

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కూరగాయల వ్యాపారులతో మాటామంతీ సమస్యల పరిష్కారానికి భరోసా దర్శి, మహానాడు : రాష్ట్రంలో జూన్‌ 4 తర్వాత కూటమి ప్రభుత్వం రాబోతుందని, చిరు వ్యాపారుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆమె ఒక సాధారణ మహిళగా కూరగాయల షాపునకు వెళ్లి కూరగాయలు కొంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేసవిలో తాగునీరు సక్రమంగా […]

Read More

రేవ్‌ పార్టీ కేసులో ఇద్దరు పోలీసులకు మెమోలు

బెంగళూరు:  రేవ్‌ పార్టీ కేసులో చర్యలు చేపట్టిన బెంగళూరు పోలీస్‌ ఉన్నతాధి కారులు మరో ఇద్దరు పోలీసులకు మెమో జారీ చేశారు. డిప్యూటీ ఎస్పీ, ఎస్సై వివరణ ఇవ్వాలని ఎస్పీ మల్లిఖార్జున్‌ మెమో ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిం చిన ఏఎస్సై నారాయణస్వామి, కానిస్టేబుళ్లు దేవరాజ్‌, గిరీష్‌పై సస్పెన్షన్‌ వేటు పడిన విషయం తెలిసిందే. రేవ్‌ పార్టీపై సమాచారం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహ రించినందుకు వారిని సస్పెండ్‌ చేశారు.

Read More

రామేశ్వరం కేఫ్‌..జర జాగ్రత్త!

హైదరాబాద్‌, మహానాడు : ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో గడువు ముగిసిన, కలుషిత ఆహారాన్ని అందిస్తూ హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు భోజన ప్రియులను దోచుకుంటున్నా యి. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వేల రూపాయలు డబ్బు పెట్టి తింటునా నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారు. తాజాగా మాదాపూర్‌ రామేశ్వ రం కేఫ్‌లో జరిగిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. గడువు ముగుసిన 100 కిలోల మినపప్పు, 10 కిలోల పెరుగు, 8 […]

Read More

రాష్ట్రంలో కూటమి గెలుపునకు అవకాశం

కౌంటింగ్‌ ఏర్పాట్లకు సిద్ధం కండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: రాష్ట్రంలో కూటమికి అవకాశం ఉందని పలు విశ్లేషణలు తేట తెల్లం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. వెబెక్స్‌ వీడియో మాధ్యమం ద్వారా శుక్రవారం ఆమె రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, కౌంటింగ్‌ ఏజెంట్లు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని […]

Read More

62వ సారి అరుదైన ‘‘ఓ’’ నెగెటివ్‌ రక్తదానం

బీజేపీ నేత, న్యాయవాది మహేందర్‌రెడ్డి మానవత్వం స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదుల అభినందన కరీంనగర్‌:  ప్రాణాపాయంలో ఉన్న వారికి అత్యవసరమైన స్థితిలో అత్యంత అరుదైన ‘‘ఓ’’ నెగటివ్‌ గ్రూప్‌ రక్తాన్ని దానం చేస్తూ ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకుంటున్నారు కరీంనగర్‌ బార్‌ అసోసి యేషన్‌ జనరల్‌ సెక్రటరీ, న్యాయవాది, బీజేపీ రాష్ట్ర నాయకుడు బేతి మహేంద ర్‌రెడ్డి. గంగాధర మండలం నాగిరెడ్డిపూర్‌ గ్రామానికి చెందిన పంజాల జలజ నగరంలోని […]

Read More

త్వరలో అమరావతి అమరవీరుల స్మారక స్థూపం

గౌరవ అధ్యక్షుడిగా యలమంచిలి ప్రసాద్‌ బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అమరావతి, మహానాడు : ప్రజా రాజధాని అమరావతి ఉద్యమ స్ఫూర్తి చిహ్నంగా రాజధాని ఉద్యమంలో అమరులైన అమరావతి అమరవీరుల పేరిట స్మారక స్థూపం నిర్మించబోతున్నట్లు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చికాగోకు చెందిన ఎన్‌ఆర్‌ఐ యలమంచిలి ప్రసాద్‌ గౌరవ అధ్యక్షుడిగా అమరవీరుల స్మారక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. […]

Read More

సర్కారు అక్రమ కేసులకు భయపడేది లేదు

– కేసీఆర్‌ తయారుచేసిన సైనికులం – గద్దెనెక్కిన నాటి నుంచే బెదిరింపులు ప్రారంభం – వైఫల్యాలను ఎత్తిచూపితే, హామీలపై ప్రశ్నిస్తే కేసులు – ప్రభుత్వ తప్పులకు బీఆర్‌ఎస్‌ నేతలపై ప్రతీకార చర్యలు – న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం..దోషులుగా నిలబెడతాం – బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ వై.సతీష్‌రెడ్డి హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే అజెండాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ వై.సతీష్‌రెడ్డి […]

Read More

16 ఏళ్లకే ఎవరెస్ట్‌ను ఎక్కేసింది!

-తొలి భారత పిన్న వయస్కురాలిగా రికార్డ్‌ -ప్రపంచంలోనే ద్వితీయస్థానంలో కామ్యా ముంబయి: ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించి ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్‌ అసాధా రణ రికార్డు నెలకొల్పింది. మౌంట్‌ ఎవరెస్ట్‌ను నేపాల్‌ వైపు నుంచి అధిరోహించి న తొలి భారత పిన్న వయస్కురాలిగా నిలిచింది. అలాగే ప్రపంచం మొత్తం మీద ఈ ఘనత సాధించిన రెండో అతిపిన్న వయస్కురాలిగా ఖ్యాతిగాంచింది. […]

Read More

మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర మళ్లీ భారీ శబ్దాలు

భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌ దగ్గర మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. శుక్రవారం ఏడో బ్లాకులోని 16వ గేటును పైకి ఎత్తేందుకు ప్రయత్నించగా భూగర్భంలో శబ్దాలు వినిపించాయి. దీంతో బ్యారేజ్‌ పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందన్న అనుమానంతో పనులు నిలిపివేశారు. గతంలో వరదల సమయంలో పునాదుల కింద ఇసుక కొట్టుకు పోవడంతో భారీ గొయ్యి ఏర్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దానిని పూడ్చివేశాకే గేట్లు తెరిచే అవకాశం […]

Read More