ఇక తెలంగాణ వాహనాలన్నీ టీజీ

గెజిట్ నోటిఫికేషన్‌ జారీ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక నుండి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌లు టీఎస్ స్థానంలో టీజీ పేరుతో ఉండే విధంగా రిజిస్ట్రేషన్లు చేయాలని పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం, సీరియల్ నంబర్ 29- ఏ , టీఎస్ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల […]

Read More

వైసీపీ రౌడీయిజం

-టీడీపీ యువనేత లోకేశ్ రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజానికి పాల్పడుతోందని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. ‘వైజాగ్లో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. టీడీపీకి ఓటు వేశారని దాడి చేయడం దుర్మార్గం. ఓటమి ఖాయమని తెలిసే ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారు. ఇది మహిళలపై జరిగిన దాడి కాదు.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి’ అని ఆయన పేర్కొన్నారు.

Read More

ఎంఐఎం నేతలపై కేసు

మాధవి లతపై దాడి కేసు హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై గురువారం తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్ పురా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. […]

Read More

ఏపీలో హింసపై ఈసీ సీరియస్

పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇవాళ రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ… పోలింగ్ రోజు, అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని నిర్ధారించింది. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్టు నివేదిక అందిందని […]

Read More

బాబు కోసం హనుమంతుడి ఇంట మొక్కులు

అమరావతి, మహానాడు : రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావాలని కోరుకుంటూ పార్టీ సానుభూతిపరులు అయోధ్యలో ఉన్న ఆ హనుమంతుడు నివసించిన ఇంటిని దర్శించుకున్నారు. జూన్‌ 4న కౌంటింగ్‌లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ హనుమంతుడిని మొక్కుకున్నారు.

Read More

ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లలో

ఆరోసారి భారత్‌కు అగ్రస్థానం హైదరాబాద్‌ : ప్రపంచంలోనే 2023లో అత్యధిక సంఖ్యలో గ్లోబల్‌ ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ లు భారత దేశంలో అత్యధికంగా నమోదయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్దేశపూర్వకంగా ఇంటర్నెట్‌ డిస్‌ కనెక్ట్‌ చేయబడిన సంఘటనలు 116 జరిగాయి. దీంతో గ్లోబల్‌ ఇంట ర్నెట్‌ షట్‌డౌన్‌లలో భారత్‌ వరుసగా ఆరోసారి అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మయన్మార్‌ (37), తర్వాతి స్థానాల్లో ఇరాన్‌ (34), పాలస్తీనా (16), ఉక్రెయిన్‌ (8) […]

Read More

పోలీసుల అదుపులో కారంపూడి సర్పంచ్‌

పల్నాడు జిల్లా కారంపూడి : ఇటీవల కారంపూడిలో జరిగిన టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య గొడవల నేపథ్యంలో కారంపూడి సర్పంచ్‌ రామావత్‌ తేజానాయక్‌ పాత్ర ఉందని భావించిన పోలీసులు గత మంగళవారం అర్థరాత్రి దాటాక మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి తీసుకు వెళ్లినట్లు సర్పంచ్‌ కుటుంబసభ్యులు చెబుతున్నారు. రెండురోజుల నుంచి తేజానాయక్‌ స్థానిక పోలీసుస్టేషన్‌లోనే ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా పేటసన్నేగండ్ల గ్రామం పోతురాజుగుట్టలో […]

Read More

పల్నాడు హింసాత్మక ఘటనలపై హైకోర్టు సీరియస్‌

అదనపు బలగాలు పంపాలని ఆదేశం అమరావతి, మహానాడు : పల్నాడులో జరుగుతున్న హింసాత్మక ఘటనలను నివారించాలని, జరిగిన ఘటనలపై విచారణ చేబట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని కోరుతూ తెలుగు దేశం న్యాయవాదుల విభాగం కార్యనిర్వాహక సభ్యులు వినుకొండకు చెందిన నల్లబోతు రామకోటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. జస్టిస్‌ జ్యోతిర్మయి వాదనలు విన్నారు. పిటిషనర్‌ తరపున న్యాయవాదులు రవితేజ పదిరి, పిళ్లా యశ్విని వాదనలు వినిపించారు. పల్నాడు వ్యాప్తంగా […]

Read More

కాళ్లూ చేతులు లేకపోతేనేం..

పద్మశ్రీ అవార్డు గ్రహీత కేఎస్ రాజన్న కేఎస్ రాజన్న.. తన సేవా కార్యక్రమాలకు గానూ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. దివ్యాంగుడైన ఆయన మోకాళ్లపై నడిచి వచ్చి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి అవార్డు తీసుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా వద్దకు వెళ్లి నమస్కరించారు. కర్ణాటకకు చెందిన రాజన్న 11 నెలల వయసులో పోలియో బారిన పడి కాళ్లు, చేతులు కోల్పోయారు. మనోధైర్యం కోల్పోకుండా ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం […]

Read More

ఖరీఫ్‌ కార్యాచరణపై మంత్రి తుమ్మల సమీక్ష

పంటల బీమాపై అధికారులకు దిశానిర్దేశం పంట నష్టంపై నివేదిక ఇవ్వాలి పచ్చిరొట్ట విత్తనాల సరఫరాపై ఆదేశాలు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్లు పూర్తిచేయాలి సహకార సంఘాల ఎన్నికలకు సూచనలు హైదరాబాద్‌, మహానాడు : ఖరీఫ్‌ కార్యాచరణ, రుణమాఫీ విధివిధానాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం అధికారులతో చర్చించారు. రుణమాఫీ పథకం విధివిధానా లపై అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్‌ 2024 నుంచి అమలయ్యే పంటల బీమా విధి విధానాలపై దిశా […]

Read More