రాజమండ్రి, మహానాడు : రాజమండ్రిలోని పలు చర్చిలలో ఫాదర్స్ జాన్ వెస్లీ, ప్రతాప్ సిన్హా, టి.జాన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రార్ధనలు నిర్వహించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ అనపర్తి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు దగ్గుబాటి హితేష్ పాల్గొన్నారు.
Read Moreఆ అనుభూతులూ.. అనుభవాలూ ఇప్పుడేవీ?
– కాగడా వేసి వెతికినా.. అంజనం వేసి చూసినా కానరావు – అర్ధరాత్రి దాకా.. టీవీలూ, ఫోన్లూ.. ఏసీ లతో బంధించిన గదులు ఎండాకాలం.. మండేకాలం.. వచ్చేసింది. ఉదయం నుండే ఏసీలూ.. కూలర్లూ.. బయ్యిబయ్యిమని తిరిగేస్తూవుంటాయి. ఫంక్షన్ హాళ్ళూ.. షాపింగ్ మాల్సూ.. అన్నీ ఏసీలే.. ప్రయాణాలు కూడా ఏసీ బళ్ళలోనే.. ఏంటో.. అవిలేందే ఉండలేని పరిస్థితి ఇప్పుడు.. వీపున కట్టుకునే ఏసీ మిషన్లు కూడా వచ్చేస్తాయేమో త్వరలో.. అలా ఓ […]
Read Moreవైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు
జగ్గయ్యపేట, మహానాడు : జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామం నుంచి మాజీ ఎంపీటీసీ చింతలచెరువు నాగేం ద్రం ఆధ్వర్యంలో పసుపులేటి శ్రీను, పసుపులేటి కుమార్, పసుపులేటి వినయ్, వారి కుటుంబ సభ్యులు వైసీపీని వీడి శ్రీరాం చిన్నబాబు సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి శ్రీరాం జయరాముడు, చిన్నబాబు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎంపీటీసీ బండ్ల జ్ఞాన్ ప్రకాష్, శ్రీనివాస్, ఎస్.కె.కరీం, […]
Read Moreఅన్నదాత డొక్కా సీతమ్మ!
-డొక్కాసీతమ్మ ది మోస్ట్ చారిటబుల్ ఉమెన్ ఆఫ్ సౌత్ ఇండియా -నేడు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కాసీతమ్మ వర్ధంతి తూర్పుగోదావరి జిల్లా, లంకలగన్నవరంలో ‘డొక్కా సీతమ్మ’ జోగన్న దంపతులు ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా ఇప్పుడు కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నధాత్రి! వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ అన్నదాన సంకల్పం, దీక్ష ఎంత గోప్పవంటే, కనీసం తన ఇష్టదైవం అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి […]
Read Moreమీకు, మీ మేనిఫెస్టోకు విలువ లేదు..
2019లో మాట నిలబెట్టుకోలేదు.. ఇప్పుడు ప్రజలు ఎందుకు నమ్మాలి? పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి విశాఖపట్నం, మహానాడు : మీకు.. మీ మాటకు విలువ లేదు..మీ మేనిఫెస్టోకు విలువ లేదంటూ వైసీపీపై పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆమె స్పందించారు. 2019లో ఇచ్చిన హామీలపై మాట నిలబెట్టుకోలేదు..ఇప్పుడు మళ్లీ కొత్త మేనిఫెస్టో అంటే ఎవరు నమ్ముతారు? మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ప్రమాణం […]
Read Moreలోకేష్ సంకల్పానికి స్పందన
-ఓడినచోటే గెలవాలనే మంగళగిరి నుంచి పోటీ -లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన ప్రముఖులు అమరావతి: మంగళగిరిని నెం.1 గా మార్చాలన్న యువనేత నారా లోకేష్ సంకల్పానికి నియోజకవర్గ ప్రముఖుల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామం నుంచి మాజీ ఎఎంసీ ఛైర్మన్ ముత్తయ్య ఆధ్వర్యంలో 6వ వార్డు సభ్యురాలు కనపాల మేరికుమారి సహా 10 మంది, చినపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మల్లవరపు నాగేశ్వరరావు […]
Read Moreచేనేతల ఆత్మహత్యలు..కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే
సీఎం, సంబంధింత మంత్రి బాధ్యత తీసుకోవాలి తక్షణమే నేతన్నలను ఆదుకోవాలి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ ఎల్.రమణ హైదరాబాద్, మహానాడు : తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ ఎల్.రమణ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చిందని, గ్యారంటీల పేరుతో వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి నిలుపుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేత కార్మికులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేనేత పరిశ్రమ […]
Read Moreసాహస బాలుడికి ముఖ్యమంత్రి రేవంత్ అభినందన
హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ శివారులోని ఓ పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఆరుగు రిని కాపాడిన సాయిచరణ్ను ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన 15 ఏళ్ల సాయిచరణ్ది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ. పరిశ్రమలో కార్మికులు చిక్కుకోగా తాడు కట్టి కార్మికులను రక్షించాడు. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడంతో బాలుడిని పిలిపించి అభినందించారు.
Read Moreఅధికారంలోకి వచ్చాక ఇస్లామిక్ బ్యాంక్
-టిడిపిలో చేరిన ఇస్లామిక్ ఫ్రంట్ కీలకనేత అక్రమ్ -లోకేష్ సమక్షంలో 200మందితో పార్టీలో చేరిక అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో వైకాపాకు మరో షాక్ తగిలింది. మంగళగిరి సమగ్రాభివృద్ధికి కలిసి రావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపుతో పలువురు ప్రముఖులు టిడిపిలో చేరుతున్నారు. మంగళగిరి పట్టణానికి చెందిన వైసీపీ నేత, ఇస్లామిక్ ఫ్రంట్ కన్వీనర్ షేక్ అక్రమ్ 200 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు. తాడేపల్లి పట్టణ 22వ వార్డు […]
Read Moreయుద్ధప్రాతిపదికన రాజధాని పనులు
-మీ బిడ్డనంటున్నాడు… భూములు కొట్టేస్తాడు జాగ్రత్త -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారాలోకేష్ మంగళగిరి: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన అమరావతి పనులు చేపట్టి, 5కోట్ల ఆంధ్రులు తలెత్తుకు తిరిగేలా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నీరుకొండ ప్రజలతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్ర భవిష్యత్తు కోసం విలువైన భూములిచ్చిన […]
Read More